రచయిత నుండి డైరెక్టర్ గా మారిన కొరటాల శివ తెలుగు సినీ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా దూసుకుపోతున్నారు . ఇక ఈయన సినిమాలలో జనాలకు ఆకట్టుకునే ఏదో ఒక కొత్త అంశం తప్పనిసరిగా ఉంటుంది అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు.. సినిమాలో డైలాగు మొదలవడం నుంచి ఎండింగ్ వరకు ప్రతి పాత్రలో కూడా సరి కొత్తదనాన్ని చూపించడంలో కొరటాలశివ దిట్ట అని చెప్పవచ్చు. ఇంతవరకు ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకున్న కొరటాలశివ ఆచార్య సినిమాతో మొదటి సారి ఫ్లాప్ ను చవి చూశాడు. అయితే కథ పరంగా ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలినా..కలెక్షన్ల విషయంలో మాత్రం మంచి రాబడిని సొంతం చేసుకుంటోంది.ఆచార్య సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న కొరటాల శివ తన ఫేవరెట్ యాక్టర్స్ గురించి బయటపెట్టడం జరిగింది. ఆ నలుగురు నటీనటుల అంటే చాలా ఇష్టమట. ఇక వారిలో ముందుగా ఎవరెవరు ఉన్నారు అంటే..

1. హంస నందిని:మొదటిసారి దర్శకుడిగా మిర్చి సినిమాకు మారి సక్సెస్ను సొంతం చేసుకున్నాడు . ఇందులో పాటలు దేవిశ్రీప్రసాద్ అందించగా .. అందులో మిర్చి మిర్చి మిర్చి లాంటి కుర్రాడే పాటలో హంసనందిని ను ఎంపిక చేసుకోవడం జరిగింది.  ఈ పాట అభిమానులను ఉర్రూతలూగించింది. ప్రత్యేక ఆకర్షణగా కుర్రకారులో ఈ పాట నిలిచిందని చెప్పవచ్చు. అందుకే హంసనందిని అంటే ప్రత్యేకమైన అభిమానం.

2. కాజల్ :జనతా గ్యారేజ్ సినిమాలో హీరోయిన్ కాజల్ తో  పక్కా లోకల్ అంటూ మాస్ స్టెప్పులు వేయించాడు కొరటాల శివ. ఈమె కూడా ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక కాజల్ వల్ల కూడా ఈ సినిమా హిట్ అయింది కాబట్టి ఈమె అంటే కొరటాల శివకు ప్రత్యేకమైన అభిమానం.

3. పూర్ణ:మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాలో పూర్ణ రాములోడు వచ్చినాడు రో అనే పాటకు స్టెప్పులు వేసింది. ఇక ఈమె కూడా ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

4. సంగీత:ఇటీవల వచ్చిన ఆచార్య సినిమాలో లాహే లాహే అనే పాటలో ప్రత్యేక ఆకర్షణగా స్టెప్పులేసి గుర్తింపు తెచ్చుకుంది సంగీత. ఇలా వీరందరినీ కూడా తన సినిమాలలో ప్రత్యేక ఆకర్షణగా ఉంచుతూ కొత్తదనాన్ని చూపించాడు కొరటాల శివ.

మరింత సమాచారం తెలుసుకోండి: