బాహుబలి సినిమా తర్వాత అనుష్క ఇప్పటివర కు ఓకే ఒక్క చిత్రంలో నటించింది. ఆ తర్వాత తెరపై కనిపించలేదు. అదిగో ఇదిగో అంటున్నారు కానీ అనుష్క నటించిన సినిమా ఇప్పటిదాకా మొదలు పెట్టుకోకపోవడం ఆమె అభిమా నులను ఎంతగానో నిరాశపరుస్తుంది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా చిన్న హీరోయిన్ గా సినిమా పరిశ్రమలోకి వచ్చిన అనుష్క కు ఇప్పుడు మీడియం రేంజ్ హీరోయిన్ స్థాయిలో మార్కె ట్ ఉంది. అభిమానులు కూడా భారీ స్థాయిలో ఉన్నారు. బాహుబలి సినిమా ఆమెకు దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ను తీసుకురాగా ఈ చిత్రం తరువాత ఆమె భాగమతి సినిమా లో మాత్రమే నటించింది.

అది కూడా సూపర్ హిట్ కావడంతో ఈ ఫిమేల్ లేడీ ఓరియంటెడ్ సినిమా లో మరికొన్ని రోజులు కనిపిస్తుందని అందరూ భావించారు. కానీ ఎందుకో ఆమెకు సినిమా అవకాశాలు రాలేదు.మారి ఆమె సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి  కూడా చూపలేదొ అర్థం కావడం లేదు. దానికి తోడు ప్రభాస్ తో ఆమె ఎఫైర్ నడిపిస్తుందని వార్తలు కొన్ని రోజులు ప్రచారం అయ్యాయి. బాహుబలి సినిమాలో హీరోయిన్ గా నటించిన త ర్వాత ఆమెకు ఈ రకమైన వార్తలు ఎక్కువగా వచ్చాయి. ఆ తర్వాత నవీన్ పోలిశెట్టి సినిమా లో కీలకపాత్రలో నటించబోతున్నారు.

ఈ సినిమాలో ఈమె హీరోయిన్ గా నటిస్తుందని అన్నారు కానీ అది కూ డా పట్టాలెక్కలేదు తాజాగా ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో చేయబోయే సినిమాలో ఆమె హీరోయిన్ గా నటిస్తుందని అంటున్నారు. దానయ్య నిర్మించబోతున్న ఈ చిత్రం త్వరలోనే అధికారి క ప్రకటన తీసుకోబోతుండగా ఇందులో మొత్తం ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారు. వారిలో ఒక హీరోయిన్ గా అనుష్క నటిస్తుందని చెబుతున్నారు. ఇదే నిజమైతే అనుష్క అభిమానులకు  ఇది మంచి వార్త అని చె ప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: