జబర్దస్త్ కార్యక్రమం పేరు చెప్పగానే బుల్లితెర ప్రేక్షకులందరికీ గుర్తుకు వచ్చేది రష్మీ సుధీర్  జోడి. వీరిద్దరూ లేరంటే ఇక జబర్దస్త్ కార్యక్రమానికి చూడటానికి కూడా ఇష్టపడని వారు చాలామంది ప్రేక్షకులు ఉన్నారు. ఇప్పటికే సుధీర్ రష్మి ఈటీవీ లోని పలు కార్యక్రమాలలో కనిపించడం లేదు అంటూ కామెంట్ లలో తెగ రెచ్చిపోతున్నారు అన్న విషయం తెలిసిందే. ఇలా జబర్దస్త్ మొదలైన నాటి నుంచి నేటి వరకు సుధీర్ రష్మీ  జోడి బుల్లితెర ప్రేక్షకులందరికీ ఎవర్గ్రీన్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇక వీరిద్దరూ ప్రేమగా మాట్లాడుకోవటం చూసి అటు బుల్లితెర ప్రేక్షకులు మురిసిపోతూ ఉంటారు.


 అంతేకాదండోయ్ రష్మీ సుధీర్ పెళ్లి చేసుకుంటే ఎంత బాగుండు అని కోరుకోని బుల్లితెర ప్రేక్షకులు లేడు అని చెప్పడంలో కూడా అతిశయోక్తి లేదు. అంతలా రష్మీ సుధీర్ మధ్య లవ్ ట్రాక్ బాగా పండింది. అయితే ఇటీవలే మాత్రం జబర్దస్త్ లో పరిస్థితులు మారిపోతున్నాయి. మొన్నటివరకు జబర్దస్త్  అంటే రష్మీ సుధీర్ జోడి మాత్రమే గుర్తుకు వచ్చేది. కానీ ఎప్పుడూ సుడిగాలి సుదీర్ ను ఆకర్షించేందుకు మరో లేడీ వచ్చేసింది అన్నది తెలుస్తుంది. ఇటీవల జబర్దస్త్ లో జడ్జిగా పూర్ణ ఎంట్రీ ఇచ్చింది అన్న విషయం తెలిసిందే. ఎంట్రీ ఇచ్చిన మొదటి ఎపిసోడ్ లోనే సుధీర్ చంపకొరికి రష్మి కి షాక్ ఇచ్చింది.


 ఇటీవల విడుదలైన ప్రోమో లో రష్మీ ముందే సుధీర్ ని పొగడ్తలతో ముంచెత్తింది. ఇటీవల విడుదలైన ఎక్స్ ట్రా జబర్దస్త్  కార్యక్రమం ప్రోమో వైరల్ గా మారిపోయింది. ఈ ప్రోమో చివరిలో ఇలా అంటున్నందుకు సారి రష్మి.. సుధీర్ నేను ఫ్లర్ట్ చేయడం లేదు.. ఈరోజు నువ్వు చాలా హ్యాండ్ సమ్ గా ఉన్నావ్.. యు ఆర్ లూకింగ్ సో హ్యాండ్సమ్ అంటూ చెప్పింది పూర్ణ. దీంతో నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా సుధీర్ రష్మి మధ్యలోకి పూర్ణ వచ్చింది ఏంటి అంటూ కామెంట్ కూడా పెడుతున్నారు అనే చెప్పాలి. కొంతమంది పూర్ణతో సుధీర్ ని పొగిడించటం కొత్త ప్లాన్ అంటూ కామెంట్ చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: