తమిళనాడులో రజనీకాంత్ కమలహాసన్ ల తరువాత మాస్ ప్రేక్షకులను మెప్పించి నిలదొక్కుకున్న కోలీవుడ్ టాప్ హీరోలలో విజయ్ అజిత్ లు ప్రధమ స్థానంలో ఉంటారు. అయితే గత కొంత కాలంగా వీరిద్దరు సినిమాలు ఘోరంగా ఫెయిల్ అవుతున్నాయి. దీనికితోడు తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందాలి అని వీరిద్దరూ చేస్తున్న ప్రయత్నాలు కూడ బెడిసికొడుతున్నాయి.


సినిమాకు కనీసం 50 కోట్ల పారితోషికం తీసుకునే వీరిద్దరూ పాన్ ఇండియా హీరోలుగా మారాలని చేస్తున్న ప్రయత్నాలు వీరికి కనీసపు విజయాన్ని కూడ ఇవ్వలేకపోతున్నాయి. దీనితో వీరిద్దరు మార్కెట్ పూర్తిగా పడిపోయింది. ఇలాంటి పరిస్థితులలో తమిళ దర్శకుడు వెంకట్ ప్రభువుకు వచ్చిన ఆలోచనకు వీరిద్దరూ ఓకె చేసినట్లు వార్తలు వస్తున్నాయి.


కోలీవుడ్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం అజిత్ విజయాలు కలిసి ఒక మల్టీ స్టారర్ చేయడానికి ఓకె చేసినట్లు టాక్. ఈ మూవీని వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తాడట. తమిళనాడులో రజినీకాంత్ తరువాత విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు అజిత్ విజయ్ లు మాత్రమే. వీరిద్దరి వరసపెట్టి ఫెయిల్ అవుతున్న పరిస్థితులలో వీరి అభిమానులు తీవ్రంగా కలత చెందుతున్నారు. దీనితో ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలో చరణ్ జూనియర్ లు కలిసి నటించి కలక్షన్స్ రికార్డులను క్రియేట్ చేసినట్లు అజిత్ విజయ్ లు కలిసి ఒక సినిమాలో నటిస్తే ఆ సినిమాకు వందల కోట్ల కలక్షన్స్ రావడం ఖాయం అంచనాలతో వీరిద్దరూ చేయిచేయి కలబోతున్నట్లు టాక్.


అయితే చరణ్ జూనియర్ ల మ్యానియాను తట్టుకుని నిలబడగల స్థాయి రాజమౌళికి ఉంది. రాజమౌళి స్థాయి తో పోల్చుకుంటే వెంకట్ ప్రభు స్థాయి చాల తక్కువ. దీనితో ఈ దర్శకుడు తమిళ సినిమా రంగానికి చెందిన ఇద్దరు టాప్ హీరోలను ఏ విధంగా మేనేజ్ చేయగలడు అన్న సందేహాలను తమిళ మీడియా వ్యక్త పరుస్తోంది. వెంకట్ ప్రభు ఎంతవరకు ఈ విషయంలో సక్సస్ సాధించగలడో
చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: