సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. సర్కారు వారి పాట  సినిమాని మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  ఈ సినిమాను మే 12 వ తేదీన విడుదల చేయనున్నారు.  ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర బృంద విడుదల చేసింది. 

సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం సర్కారు వారి పాట మూవీ ట్రైలర్ యూట్యూబ్ లో మిలియన్ల కొద్ది రోజుల్లో వ్యూస్ ను సాధిస్తూ ముందుకు దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో మే 7 వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నట్లు చిత్రబృందం తాజాగా ఆఫీషియల్ అనౌన్స్మెంట్ చేసింది.  ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మే 7 వ తేదీ సాయంత్రం 6 గంటలకు యూసుఫ్ కూడా పోలీస్ గ్రౌండ్స్ హైదరాబాద్ లో జరగనున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది.  ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుండి మరొక ఉపడయే ను చిత్ర బృందం విడుదల చేసింది.  

సినిమా నుండి  'మా... మా... మహేశ'  అనే లిరికల్ వీడియో సాంగ్ ను మే 7 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది.  ఒక పోస్టర్ ద్వారా చిత్ర బృందం ఈ ప్రకటనను  చేసింది. ఈ పోస్టర్ లో మహేష్ బాబు మరియు కీర్తి సురేష్ ఇద్దరు డాన్స్ స్టెప్పులు వేస్తూ ఉన్నారు.  ఈ పోస్టర్ కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది.  మరి ఈ సాంగ్ ఏ రేంజ్ లో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.  ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: