అయితే వాటిని సీరియస్ గా తీసుకున్న రోజా పట్టుదలతో అవకాశాలు తనని వెతుక్కుని వచ్చేలా తన నటనతో ఆకర్షించారు. విమర్శించిన వారితోనే ప్రశంసలు అందుకున్న అవార్డులు అందుకున్న సందర్భాలెన్నో ఉన్నాయట. ఆ తర్వాత తమిళ దర్శకుడు సెల్వమణి ని బంధుమిత్రుల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. ఇక హీరోయిన్ గానే కాకుండా సెకండ్ ఇన్నిగ్స్ లో వయసుకు దగ్గ పాత్రలను చేస్తూ అలరించారు. రాజకీయ రంగం లోనూ ప్రవేశించి అక్కడ కూడా తన ఉనికిని చాటుకున్నారు రోజా. ఇపుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంత్రిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
అయితే నిన్న మొన్నటి దాకా జబర్దస్త్ ది కి జడ్జిగా, మరికొన్ని షో లకు న్యాయ నిర్ణేతగా, వ్యవహరించిన ఈమె మంత్రి అయ్యాక తన పూర్తి సమయాన్ని ప్రజల కొరకే కేటాయించాలని కెమెరాకు దూరం అయిన విషయం తెలిసిందే. ఇక ఈమె జబర్దస్త్ షోకి జడ్జిగా వ్యవహరిస్తున్న అందుకుగాను నెలకు 20 లక్షలకు పైగానే పారితోషికం తీసుకునేవారట, అలాగే బతుకు జట్కా బండి వంటి షోలకు ఒక ఎపిసోడు కు 50 వేల వరకు పుచ్చుకునే వారట ఇలా తన జీవితం లో నటిగా, భార్య గా, తల్లిగా, నాయకురిలాగా ఎన్ని అద్భుతాలను సృష్టించారు రోజా.