ఈరోజు భాగ్యనగరంలో జరగబోతున్న ‘సర్కారు వారి పాట’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. అత్యంత భారీస్థాయిలో జరగబోతున్న ఈమూవీ ఈవెంట్ కు ఇప్పటివరకు అధికారికంగా ముఖ్య అతిధులను పిలవకపోవడం హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి ఈ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా వస్తారని ప్రచారం జరిగింది. అంతేకాదు మహేష్ స్వయంగా వెళ్ళి పవన్ ను ఆహ్వానించాడు అని కూడ వార్తలు వచ్చాయి.


అయితే ఆవిషయాలు ఏది కార్యరూపం దాల్చకపోవడం వెనుక కారణం ఎవరికీ అంతుచిక్కడం లేదు. వాస్తవానికి పవన్ కు మహేష్ కు మధ్య చెప్పుకోతగ్గ సాన్నిహిత్యం లేకపోయినప్పటికీ గతంలో పవన్ నటించిన సినిమాకు మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఇప్పుడు ఆ ఋణాన్ని తీర్చుకోవడానికి పవన్ ఖచ్చితంగా ఈకార్యక్రమానికి వస్తాడు అంటూ ప్రచారం జరిగినప్పటికీ ఆవిషయాన్ని అధికారికంగా ప్రకటించకపోవడంతో మహేష్ సినిమాకు ముఖ్య అతిధి లేకుండా ఈవెంట్ జరుగుతోందా అన్నసందేహాలు వస్తున్నాయి.


వాస్తవానికి ఈ ఈవెంట్ కు అతిధిగా రమ్మని పిలిస్తే రాజమౌళి వస్తాడు. లేదంటే త్రివిక్రమ్ కూడ వస్తాడు. అయితే వారిని కూడ అతిధులుగా పిలిచినా సందర్భం కనిపించడం లేదు. దీనితో ఈమూవీ మేకర్స్ ఎవర్ని అతిధులుగా పిలవకుండా ఎందుకు ఈ ఈవెంట్ ను ఇలా నిర్వహిస్తున్నారు అన్నసందేహాలు చాలామందికి వస్తున్నాయి. మరికొందరైతే ఈ ఈవెంట్ కు ఎవర్ని పిలవకపోవడం వెనుక  మరొక కారణం ఉంది అన్నకామెంట్స్ కూడ వినిపిస్తున్నాయి.


‘సర్కారు వారి పాట’ మూవీ ఫంక్షన్ కు మరొక ప్రముఖ వ్యక్తిని అతిధిగా పిలిస్తే జనం దృష్టి అంతా ఆ ముఖ్య అతిధి వైపు వెళ్ళిపోతుందని అందువల్ల అతిధులు లేకుండా ఈఫంక్షన్ ను నిర్వహిస్తే టోటల్ గా మహేష్ మాత్రమే హైలెట్ అవుతాడు అన్న వ్యూహంతో ఇలా వ్యవహరించి ఉంటారు అన్న అంచనాలు కూడ వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఒక టాప్ హీరో మూవీ ఫంక్షన్ కు ప్రముఖ వ్యక్తి అతిధిగా రాకపోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది..



మరింత సమాచారం తెలుసుకోండి: