మహానటి చిత్రంతో తానేంటో ఈ ప్రపంచానికి తెలియచేసిన నటి కీర్తి సురేష్ , ఆ సినిమా తరవాత ఆ స్థాయి గుర్తింపు దక్కించుకోలేదనే చెప్పాలి. దీనికి పలు కారణాలు ఉన్నాయి. నటన పరంగా కీర్తి పర్ఫెక్ట్ అయినా ఆ గ్రేస్ ను చూపించడానికి సరైన పాత్ర అలాగే మంచి డెప్త్ ఉన్న కాన్సెప్ట్ అవసరమన్న విషయం తెలిసిందే. అయితే మహానటి చిత్రం తరవాత కీర్తి ఎంచుకున్న కథలు పేలవంగా ఉన్నాయని అందులో కీర్తి తన నటనా ప్రతిభను కనబరిచే స్కోప్ లేకుండా పోయిందని అందుకే ఆమెకు సక్సెస్ దూరం అయ్యిందని అన్న మాటలు కూడా చాలానే వినిపించాయి. ఇక కథల ఎంపిక విషయంలో కంఫ్యూజ్ అయ్యి ఫెయిల్యూర్ హీరోయిన్ గా ఈ మధ్య విమర్శలను కూడా ఎదుర్కున్నారు కీర్తి సురేష్.

ఇక వరుస హిట్స్ తో ఫుల్ స్పీడ్ పై ఉన్న స్టార్ హీరో మహేష్ బాబు చిత్రంతో కీర్తి సురేష్ కెరియర్ మళ్ళీ స్పీడ్ అందుకుంటుందని అంతా అనుకున్నారు. ఈ సినిమాతో మళ్ళీ ఈమెకు బ్రేక్ త్రూ లభిస్తుందని అనుకున్నారు. అయితే అనుకున్న దానికన్నా ముందే అందరి దృష్టిని ఆకర్షిస్తూ తన 'చిన్ని' సినిమాతో మరో సంచలనాన్ని సృష్టిస్తోంది కీర్తి సురేష్. ఈ అమ్మడు యాక్టింగ్ ఎనర్జీకి పవర్ బ్యాంక్ అని చెప్పొచ్చు, సరైన పాత్ర పడాలే కానీ తన పవర్ ను చూపిస్తుంది ఈ అమ్మడు. ఇటీవలే ఓ టి టిలో కీర్తి ప్రధాన పాత్రలో నటించిన చిన్ని మూవీ స్ట్రీమ్ అవుతోంది. అయితే ఈ సినిమాలో కీర్తి నటన చూసి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. మహానటి అంటే ఇలా ఉండాలి అంటూ కీర్తిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

దాంతో సర్కారు వారి పాట చిత్రంతో మళ్ళీ కీర్తి తన దూకుడు పెంచుతుంది అనుకోగా అంత కన్నా ముందే చిన్ని చిత్రం తో క్రెడిట్ దక్కించుకుంటున్నారు మహానటి. ఇక ఈమె నటించిన సర్కారు వారి పాట సినిమా ఈ నెల 12 న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం విదితమే. ఈ సినిమాతో కీర్తి తన కీర్తిని డబుల్ చేసుకుంటారని అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: