టాలీవుడ్ నేటితరం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా ప్రస్తుతం తెరకెక్కిన తాజా సినిమా సర్కారు వారి పాట. 14 రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్ సంస్థలపై ఎంతో భారీ వ్యయంతో నిర్మితం అయిన ఈ సినిమా ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా భారీ థియేటర్స్ లో ప్రేక్షకాభిమానులు ముందుకి రానుంది. మహేష్ బాబు క్యారెక్టర్ మ్యానరిజమ్స్, డైలాగ్స్ వంటివి ఈ సినిమాలో పెద్ద హైలైట్ అవుతాయని, తప్పకుండా మహేష్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరినీ కూడా సర్కారు వారి పాట ఆకట్టుకుంటుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

కీర్తి సురేష్ పాత్ర కూడా సినిమాలో అదిరిపోతుందని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన సాంగ్స్ అన్ని కూడా యువత తో పాటు అన్ని వర్గాల శ్రోతలను విశేషంగా అలరించాయి. మరోవైపు థియేట్రికల్ ట్రైలర్ కి కూడా సూపర్ గా రెస్పాన్స్ రావడంతో అటు సూపర్ స్టార్ సూపర్ సక్సెస్ కొట్టడం ఖాయం అని టాలీవుడ్ ఇన్నర్ వర్గాల టాక్. ఇక మొన్న జరిగిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాల సమయంలో మూవీ చూసిన సెన్సార్ సభ్యులు సైతం మూవీని ఎంతో అభినందించారని, ఓవరాల్ గా సర్కారు వారి పాటతో సూపర్ స్టార్ ఖాతాలో మరొక బ్లాక్ బస్టర్ ఖాయం అని సమాచారం.

ఇటు మహేష్ బాబు కూడా నిన్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా మాట్లాడుతూ యూనిట్ మొత్తం కూడా దాదాపుగా రెండున్నరేళ్ల నుండి సర్కారు వారి పాట మూవీ కోసం ఎంతో శ్రమించారని, మధ్యలో కోవిడ్ సమయంలో పలు అడ్డంకులు ఎదురైనప్పటికీ కూడా ఆ తరువాత ఎంతో జాగ్రత్తగా తగు జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ చేశామని, తన గత బ్లాక్ బస్టర్ మూవీస్ లో ఒకటైన పోకిరి మాదిరిగా ఈ సినిమా కూడా అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందని మహేష్ మాట్లాడుతూ చెప్పారు. మొత్తంగా ఇన్ని విధాలుగా సర్కారు వారి పాట పై పాజిటివి బజ్ చూస్తుంటే రిలీజ్ తరువాత సర్కారు వారి పాట తో మహేష్ బాబు అన్ని రికార్డులని మడతెట్టేయడం ఖాయంగా కనపడుతోందని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: