మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న సినిమా సర్కారు వారి పాట..గత కొన్ని రోజుల క్రితం షూటింగ్ పూర్తీ చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది.. ఈ సినిమా డైరెక్టర్ పరుసురామ్ దర్షకత్వంలో రూపొందుతుంది.. ఇప్పటికే ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరిగి పోయాయి.మహేష్ కొత్త లుక్ జనాలను విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తుంది.. ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకూ బయటకు వచ్చిన అన్నీ సినిమా పై భారీ అంచనాలను పెంచుతున్నాయి..థమన్ మ్యూజిక్ సినిమాకు హైలెట్ అవ్వనుందని క్రిటిక్స్ అభిప్రాయ పడుతున్నారు..



విడుదలకు కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉండటంతో సినిమా పై అంచనాలు రెట్టింపు అవుతూన్నాయి. తాజాగా ఈ సినిమా ప్రీరిలిజ్ ఈవెంట్ ను కూడా నిర్వహించారు. ఆ కార్యక్రమానికి సినీ ప్రముఖులు ముఖ్య అతిథులు గా హాజరయ్యారు.. ఆ ఈవెంట్ సినిమాకు హైలెట్ అయ్యింది.మే 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవ్వనుంది.ఇప్పటికే ఈ సినిమా నుండి పాటలు, ట్రైలర్ రిలీజ్ కాగా అభిమానులు, ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభించింది. ఇక సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ భారీగా చేస్తున్నారు.

ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అయిపోయింది.

సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు..


నైజాం – 36 కోట్లు
సీడెడ్ – 13.5 కోట్లు
ఉత్తరాంధ్ర – 13 కోట్లు
ఈస్ట్ – 8.5 కోట్లు
వెస్ట్ – 7 కోట్లు
గుంటూరు – 9 కోట్లు
కృష్ణా – 7.5 కోట్లు
నెల్లూరు – 4 కోట్లు


మొత్తంగా ఈ సినిమాకి ఏపీ, తెలంగాణలో 98.5 కోట్ల బిజినెస్ జరిగింది.


ఓవర్సీస్ – 11 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా – 23.5 కోట్లు


టోటల్ గా సర్కారువారి పాట సినిమా ప్రపంచ వ్యాప్తంగా 125కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ సాధించి హిట్ అవ్వాలంటే దాదాపు 130 కోట్లు కలెక్ట్ చేయాలి.మరి ఈ సినిమా ఏ రేంజ్ లో కలెక్షన్స్ ను అందుకుంటుందో ఆ రోజు చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: