‘బాహుబలి’ తో నేషనల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న ప్రభాస్ ఏకంగా 100కోట్ల పారితోషికం తీసుకునే స్థాయికి ఎదిగిపోయాడు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ప్రభాస్ కు ఏమాత్రం కాలం కలిసి రావడంలేదు. ‘సాహో’ ఆతరువాత అన్ని జాగ్రత్తలు తీసుకుని తీసిన ‘రాథే శ్యామ్’ వరస పరాజయాలు రావడంతో అతడి అభిమానులు మాత్రమే కాకుండా ప్రభాస్ కూడ షాక్ నుండి తేరుకోలేక పోతున్నాడా అన్నసందేహాలు కొందరికి వస్తున్నాయి.


కొంతకాలం క్రితం ప్రభాస్ కు సర్జరీ జరిగింది అయితే ఇప్పుడు ఆసమస్య నుండి ప్రభాస్ పూర్తిగా తేరుకున్నాడు అన్నవార్తలు వస్తున్నాయి. దీనితో ప్రభాస్ తో ప్రస్తుతం సినిమాలు తీస్తున్న నిర్మాతలు అతడి డేట్స్ గురించి సంప్రదిస్తున్నా ఇంకా అతడి దగ్గర నుండి సరైన స్పందన రావడంలేదు అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం ప్రభాస్ నాగ్ అశ్విన్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న ‘ప్రాజెక్ట్ కే’ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో రెండు మూడు రోజులు కేటాయించిన ప్రభాస్ మళ్లీ ఖాళీగా ఉన్నాడు అనే వార్తలు వస్తున్నాయి.


దీనితో ప్రభాస్ ఇంకా ‘రాధే శ్యామ్’ షాక్ నుండి తేరుకోలేకపోతున్నాడా అన్న సందేహాలు కొందరికి వస్తున్నాయి. ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’ షూటింగ్ దశలో ఉంది. ‘ఆదిపురుష్’ సినిమా షూటింగ్ పూర్తి అయినప్పటికీ ఈమూవీలో ప్రభాస్ పోషిస్తున్నది శ్రీరాముడి పాత్ర కాబట్టి ఆపాత్రకు చాల డిఫరెంట్ గా డబ్బింగ్ చెప్పాలి అని ఆమూవీ దర్శకుడు ప్రభాస్ కు సూచించినట్లు టాక్. మరోవైపు సందీప్ వంగ ‘స్పిరిట్’ ఎప్పుడు మొదలవుతుందో తెలియదు.




ఈలోపు దర్శకుడు మారుతీ ప్రభాస్ కోసం రెడీ పెట్టిన ‘రాజా డీలక్స్’ ఎప్పుడు షూటింగ్ ప్రారంభం అవుతుందో తెలియదు. దీనితో ప్రభాస్ సినిమాల లైనప్ చాల కన్ఫ్యూజన్ లో ఉన్నట్లు కనిపిస్తోంది.  అయితే ఈవిషయమై ప్రభాస్ సన్నిహితులు మరోవిధంగా స్పందిస్తున్నట్లు టాక్. హైదరాబాద్ లో ఎండలు మండుతున్నాయి కాబట్టి ఇలాంటి సమయంలో ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ప్రభాస్ మరి కొన్నిరోజులు రెస్ట్ తీసుకోవాలని ఆలోచిస్తున్నాడని అందువల్ల జూన్ రెండు లేదా మూడవ వారం నుండి ప్రభాస్ తన సినిమా షూటింగ్ లకు వచ్చే ఆస్కారం ఉంది అని లీకులు ఇస్తున్నట్లు సమాచారం..  



మరింత సమాచారం తెలుసుకోండి: