సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ కథానాయికగా నటించగా,  ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని సమకూర్చాడు.  ఇప్పటికే ఈ సినిమా కోసం తమన్ అందించిన సాంగ్స్ లో నుంచి కొన్ని పాటలను చిత్ర బృందం విడుదల చేయగా ఈ పాటలకు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది.

మరీ ముఖ్యంగా సర్కారు వారి పాట సినిమా లోని కళావతి సాంగ్ యూట్యూబ్ లో అదిరిపోయే రేంజ్ లో వ్యూస్ ను సాధిస్తూ ముందుకు దూసుకుపోతోంది.  ఇది ఇలా ఉంటే సర్కార్ వారి పాట  సినిమాను  మే 12 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.  ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సినిమా ట్రైలర్ కూడా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది.  ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో తాజాగా ఈ చిత్ర బృందం ఘనంగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా నిర్వహించింది.

ఇది ఇలా ఉంటే తాజాగా సర్కారు వారి పాట  సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది.  సర్కారు వారి పాట సినిమాకు సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ సినిమా నిడివి 162 నిమిషాల 25 సెకండ్ లకు చిత్ర బృందం లాక్ చేసింది. ఇది ఇలా ఉంటే సరిలేరు నీకెవ్వరు లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత మహేష్ బాబు నటిస్తున్న సినిమా కావడం తో సర్కారు వారి పాట సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.  మరి సర్కారు వారి పాట సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: