రణ్బీర్ కపూర్, ఆలియా భట్ నాలుగేళ్ల నుంచి రిలేషన్లో ఉన్నారు. మూడేళ్ల నంచి పెళ్లి ప్రచారం జరుగుతోంది. అయితే రణ్బీర్ తండ్రి రిషి కపూర్ చనిపోవడం, కరోనా వేవ్స్ రావడంతో వీళ్ల పెళ్లి పోస్ట్పోన్ అవుతూ వస్తోంది. ఇక లాక్డౌన్స్తో రాలియా కట్టిస్తోన్న ఇంటి పనులకి బ్రేకులు పడ్డాయి. ఇక థర్డ్ వేవ్ తగ్గాక ఇంటి పనులు కూడా స్పీడందుకున్నాయి. ఇంటీరియర్ డిజైనింగ్ కూడా కంప్లీట్ కావడానికి వచ్చింది.
రణ్బీర్ కపూర్ నమ్మతాతయ్య పేరుతో కడుతోన్న కృష్ణరాజ్ బంగ్లా పూర్తి కావొచ్చింది. అలాగే కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. దీంతో వెడ్డింగ్ సెలబ్రేషన్స్కి డేట్ ఫిక్స్ చేసుకున్నారట. ఏప్రిల్ 17న ఆర్.కె. బంగ్లాలో ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. ఇక ఈ పెళ్లికి రణ్బీర్, ఆలియా ఫ్యామిలీ మెంబర్స్తో పాటు అతికొద్దిమంది సన్నిహితులని మాత్రమే ఆహ్వానించేశారట.
మరోవైపు పెళ్లి చేసుకునేటప్పుడు మాజీ లవర్స్ని అస్సలు పెళ్లికి పిలవొద్దు అంటారు. కానీ రణ్బీర్ కపూర్ మాత్రం పెళ్లికి మాజీ లవర్స్ని కూడా పిలిచాడట. మీ భర్తని తీసుకురమ్మని ఆ ఇద్దరు హీరోయిన్లకి ఇన్విటేషన్ ఇచ్చాడట రణ్బీర్. ఇదే బాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. రణ్బీర్ పెళ్లికి మాజీ లవర్స్ వస్తారా రానా అని సోషల్ మీడియాలో చర్చలు కూడా జరుగుతున్నాయి.
రణ్బీర్ కపూర్, ఆలియా భట్ ఏప్రిల్ 17న పెళ్లి చేసుకోబోతున్నారు. ముంబాయి ఆర్.కె. బంగ్లాలో జరిగే ఈ పెళ్లికి అతికొద్దిమందిని మాత్రమే ఇన్వైట్ చేస్తున్నారు. రణ్బీర్, ఆలియా ఫ్యామిలీ మెంబర్స్తో పాటు, కొద్దిమంది ఫ్రెండ్స్ని పిలుస్తున్నారట. ఇక ఈ ఫ్రెండ్స్ లిస్ట్లో రణ్బీర్ మాజీ లవర్స్ దీపిక పదుకొణే, కత్రీనా కైఫ్ కూడా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. రణ్బీర్ కపూర్ 'బచ్నా ఏ హసీనా' టైమ్లో దీపిక పదుకొణేని లవ్ చేశాడు. ఈ ప్రేమకథ చాన్నాళ్లు నడిచింది. అయితే ఏమైందో ఏమో ఆ తర్వాత వీళ్లిద్దరి విడిపోయారు. రణ్వీర్ సింగ్ని పెళ్లి చేసుకుని కొత్త లైఫ్ స్టార్ట్ చేసింది దీపిక. ఇక దీపికతో విడిపోయాక కత్రీనా కైఫ్తో రిలేషన్లోకి వెళ్లాడు. వీళ్లిద్దరికి లండన్లో ఎంగేజ్మెంట్ అయ్యింది, త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఈ లవ్స్టోరీకి మధ్యలోనే బ్రేకప్ కార్డ్ పడింది. గతేడాది డిసెంబర్లో విక్కీ కౌశల్ని పెళ్లి చేసుకుంది కత్రీన.