హీరోయిన్లు కపూర్‌ కందాన్‌లో కోడలిగా అడుగుపెడితే వాళ్ల కెరీర్‌ అక్కడితో ముగిసిపోతుంది. బబిత, నీతూ సింగ్ కపూర్‌ బహూస్‌గా మారాక సినిమాలకి దూరమయ్యారు. అయితే ఆలియా భట్‌ మాత్రం మిసెస్‌ రణ్‌బీర్‌ కపూర్‌గా మారాక కూడా సినిమాలు చేస్తోంది. 'బ్రహ్మాస్త్ర'తో పాటు రణ్‌వీర్‌ సింగ్‌తో కలిసి 'రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని' చేస్తోంది. అలాగే ఒక హాలీవుడ్ మూవీ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది  ఆలియా.

కత్రీనా కైఫ్‌ పెళ్లికి ముందు ఎంత స్పీడ్‌గాసినిమాలు చేసిందో, పెళ్లి తర్వాత కూడా అదే స్పీడ్‌తో సినిమాలు చేస్తోంది. మిసెస్‌ విక్కీ కౌశల్‌గా మారాక కొంచెం కూడా గ్యాప్‌ తీసుకోకుండా వెంటనే షూటింగ్‌ స్పాట్‌కి వెళ్లిపోయింది. 'మెర్రీ క్రిస్మస్' షూటింగ్‌లో జాయిన్ అయింది. ఇక ఈ మూవీతో పాటు సల్మాన్ ఖాన్‌తో కలిసి 'టైగర్‌3' చేస్తోంది. అలాగే ప్రియాంక చోప్రా, ఆలియా భట్‌తో కలిసి 'జీలే జరా' సినిమాలు చేస్తోంది.

దీపిక పదుకొణే పెళ్లి తర్వాత కూడా టాప్‌ చైర్‌లో కంటిన్యూ అవుతోంది. రణ్‌వీర్‌ సింగ్‌ని పెళ్లి చేసుకున్నాక, దీపిక సినిమాలు తగ్గిస్తుందనే ప్రచారం జరిగింది. కానీ దీపిక పెళ్లయ్యాక కూడా లార్జ్‌ స్కేల్‌ మూవీస్ చేస్తోంది. షారుఖ్‌ ఖాన్‌తో 'పఠాన్', ప్రభాస్‌తో 'ప్రాజెక్ట్-కె', హృతిక్ రోషన్‌తో 'ఫైటర్' సినిమాలు చేస్తోంది. వీటితోపాటు హాలీవుడ్‌ మేకర్స్‌ కూడా దీపికతో సంప్రదింపులు జరుపుతున్నారు.

అనుష్క శర్మ, ఇండియన్ క్రికెటర్‌ విరాట్ కోహ్లీని 2017లో పెళ్లి చేసుకుంది. ఆ సమయంలో అనుష్క సినిమాలకి దూరమవుతుందనే ప్రచారం జరిగింది. కానీ అనుష్క మాత్రం మిసెస్‌గా మారాక మరింత బిజీ అయింది. యాక్టింగ్‌తో పాటు నిర్మాణంలోకి దిగింది. క్లీన్ స్లేట్ ఫిల్మ్స్‌ బ్యానర్‌లో సినిమాలు తీస్తోంది. ప్రస్తుతం అనుష్క శర్మ 'చక్దా ఎక్స్‌ప్రెస్' సినిమా చేస్తోంది. ఇండియన్ విమెన్ క్రికెటర్ జులన్ గోస్వామి లైఫ్‌ హిస్టరీ ఆధారంగా తెరకెక్కుతోందీ సినిమా.

కరీనా కపూర్‌, సైఫ్ అలీ ఖాన్‌ని పెళ్లి చేసుకుని పదేళ్లు దాటింది. ఇద్దరు పిల్లలకు తల్లి అయింది. అయితే తల్లిగా బాధ్యతలు పెరిగినా, నలభై ఒక్క ఏళ్లు వచ్చినా కరీనా మాత్రం స్పీడ్‌గా సినిమాలు చేస్తూనే ఉంది. 'తలాష్, కీ అండ్ కా, సత్యాగ్రహ, భజరంగీ భాయిజాన్, ఉడ్తాపంజాబ్' లాంటి సినిమాల్లో నటించింది. ఇప్పుడు ఆమిర్‌ ఖాన్‌తో కలిసి 'లాల్‌ సింగ్‌ చడ్డా' చేస్తోంది కరీనా.


మరింత సమాచారం తెలుసుకోండి: