సర్కారు వారి పాట : గీత గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట..సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఇది 27వ సినిమా కావడం విశేషం.తెలుగు తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న మహానటి కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. మే 12 వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ ఇంకా ట్రైలర్ కి అయితే వీపరితమైన రెస్పాన్స్ రావడంతో సినిమా పైన ప్రేక్షకుల్లో బీభత్సమైన అంచనాలున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ ఇంకా అలాగే జిఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్స్ కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి యస్ యస్ తమన్ సంగీతం అందించాడు.అయితే ఈ సినిమాకి దర్శకుడు పరుశురాం పెట్ల తీసుకున్న రెమ్యునరేషన్ గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ చక్కర్లు కొడుతోంది. 



సర్కారు వారి పాట  సినిమా కోసం పరుశురాం 10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లుగా సమాచారం తెలుస్తోంది. అంతేకాకుండా లాభాల్లో కూడా 20% వాటా అనేది కూడా ఉంటుందని సమాచారం తెలుస్తుంది.అలాగే గీతా గోవిందం మూవీకి కేవలం పది లక్షల అడ్వాన్స్ రెమ్యునరేషన్ మాత్రమే తీసుకున్న పరుశురాం.. ఆ తర్వాత సినిమాల్లో కూడా వాటా తీసుకున్నారట.. దాదాపుగా ఆ సినిమాకి 50కోట్ల పైగానే లాభాలు వచ్చాయట. ఇక సర్కారు వారి పాట సినిమా విషయానికి వస్తే ఈ సినిమాని పరశురామ్ ఊర మాస్ రేంజిలో తెరకెక్కించాడు. ఖచ్చితంగా ఇందులో ఫ్యాన్స్ కి నచ్చే అంశాలు చాలా పుష్కలంగా ఉన్నాయని ట్రైలర్ ని చూస్తే అర్ధమవుతుంది. ఇక ఈ సినిమాకి ప్రీ రిలీజ్ బిసినెస్ కూడా 120 కోట్లు జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: