ఇప్పుడు కెజిఎఫ్ పార్ట్ లుగా వచ్చినా రెండు సినిమాలతో అందరినీ ఆకట్టుకుని పాన్ ఇండియా హీరోగా మారిపోయిన కన్నడ హీరో యష్ గురించి అందరిలోనూ చర్చ జరుగుతోంది. ఒక సీరియల్ నటుడిగా తన ప్రస్థానాన్ని స్టార్ట్ చేసి నేడు ఇంత పెద్ద స్టార్ హీరోగా మారడంతో అందరికీ యష్ ఆదర్శంగా మారుతున్నాడు. ఇప్పుడు చాలా వరకు యష్ ను రాఖీ బాయ్ అంటూ పిలుచుకుంటున్నారు. అంతలా కేజిఎఫ్ లో ఇతని పాత్ర అందరినీ ఆకట్టుకుంది. ఇపుడు యష్ నుండి రాబోయే తర్వాత సినిమా ఏమిటనే విషయం హాట్ టాపిక్ గా మారింది. అయితే యష్ ను ప్రశాంత్ నీల్ చూపించినంతగా ఇంకే డైరెక్టర్ అయిన చూపించగలడా అన్న హైప్ కూడా ఉంది.

ఎందుకంటే... కెజిఎఫ్ 2 లో ఇంకా యష్ ను ఏ విధంగా చుపించాడో... రాబట్టిన కలెక్షన్ లు చెబుతున్నాయి. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం యష్ తన నెక్స్ట్ సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాడట. ఎందుకంటే గతంలో టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ కూడా ఇదే విధంగా బాహుబలి సినిమాల వల్ల దక్కిన విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న క్షణంలో రెండు తప్పుల్ని చేశాడు. ఇప్పుడు అవే తనకు కొంతమేరకు నష్టాన్ని కలిగించాయి. అంత పెద్ద భారీ హిట్ సినిమాల తర్వాత ఆచితూచి అడుగులు వేయాల్సిన ప్రభాస్ కేవలం ఒక్క సినిమా అనుభవం ఉన్న కుర్ర డైరెక్టర్ ల చేతిలో పెద్ద ప్రాజెక్టులు పెట్టాడు.

అందుకే సుజిత్ డైరెక్షన్ లో వచ్చినా సాహో మరియు రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో వచ్చినా రాధే శ్యామ్ రెండూ కూడా నిరాశను మిగిలిచాయి. అందుకే ప్రభాస్ కు జరిగిన ఈ చేదు అనుభవాలను తనకు గుణపాఠాలుగా మార్చుకుని చేయబోయే సినిమా విషయంలో కేర్ ఫుల్ గా ఉన్నాడు. మరి ఈ సందర్భంలో తన సినిమాను ఎవరితో చేయనున్నాడు ? ప్రశాంత్ నీల్ కన్నా చూపించే డైరెక్టర్ యష్ కు దొరుకుతాడా ? అన్నది తెలియాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: