ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట చిత్రం సినిమా పనుల్లో చాలా బిజీగా ఉన్నారు. ఈ సినిమాపై అటు చిత్రబృందం ,అభిమానులు సైతం భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ పరుశురాం ఎంతో అద్భుతంగా తెరకెక్కించినట్లు గా సమాచారం. ఇందులో కీర్తి సురేష్ కథానాయకిగా నటిస్తోంది. ఈ చిత్రం రేపటి రోజున విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా నుండి ఇప్పటి వరకు విడుదలైన.. టీజర్స్, ట్రైలర్స్ ప్రేక్షకులను బాగానే అలరించాయి. ఇక పాటలు కూడా ఎంతో అద్భుతంగా ఉన్నాయని చెప్పవచ్చు. మహేష్ ఈ చిత్రంలో చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు.


సినిమా ప్రమోషన్ లో భాగంగా మహేష్ బాబు ఒక ఇంటర్వ్యూ లో పాల్గొనడం జరిగింది. ఇందులో మహేష్ బాబు తన తదుపరి చిత్రాల గురించి.. తన కుటుంబం గురించి కొన్ని కీలకమైన వాక్యాలు తెలియజేశారు. ప్రస్తుతం మహేష్ బాబు ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ వంటివాటిలో చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్నారని చెప్పవచ్చు. ఇక సర్కారు వారి పాట చిత్ర ప్రమోషన్స్ కోసం మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా ఒక వీడియోని షేర్ చేయడం జరిగింది. అందులో మహేష్ బాబు తన అభిమానులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలియజేసినట్లు సమాచారం.


అందులో ఒక అభిమాని ఏమోజీ తో మిమ్మల్ని మీరు వివరించండి అని తెలియజేయగా.. అందుకు మహేష్ బాబు స్మైల్ ఎమోజి ని షేర్ చేశాడు. మరొక అభిమాని కూడా మీ గురించి ఒక్క మాటలో హ్యష్  ట్యాగ్ తో చెప్పండి అని అడగగా.. కామ్ అండ్ ఫోకస్ అంటూ సమాధానం ఇచ్చారు. మరొక నెటిజన్ మీరు సోషల్ మీడియాలో ఫాలో అవ్వాలి అంటే ఎవర్ని ఫాలో అవుతారని అడవిగా.. అందుకు నమ్రతకు ట్విట్టర్ ఉంటే కచ్చితంగా ఆమెను ఫాలో అయ్యే వాడిని అని తెలియజేశారు. ఇక చివరగా ఈ చిత్రం ఈ వేసవిలో చాలా హాట్ గా ఉంచుతుందని తెలియజేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: