ఈ సినిమా పెద్ద హిట్ కాకపోయినా అందరినీ ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత అంజనేయులు, సోలో సినిమాలతో హిట్ కొట్టి, మళ్ళీ వరుసగా సారొచ్చారు తో ప్లాప్ ను చవిచూశాడు. ఆ తర్వాత మళ్ళీ అల్లు శిరీష్ తో శ్రీరస్తు శుభమస్తు ను తీసి పర్వాలేదు అనిపించుకున్నాడు. అప్పుడే ఫామ్ లో ఉన్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ కు కథ చెప్పి ఒప్పించాడు. అలా 2018 లో గీత గోవిందం తెరకెక్కింది. ఈ సినిమా ఎంత హిట్ అయింది అంటే... టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయి కూర్చుంది. వరుసగా అటు విజయ్ కి, రష్మిక కి మరియు డైరెక్టర్ పరుశురాం కి ఆఫర్లు క్యూ కట్టాయి.
అయితే పరుశురాం మాత్రం ఒక మంచి కథను తయారుచేసుకుని ప్రిన్స్ మహేష్ ను కలిసి ఒప్పించాడు. అలా మహేష్ బాబు సర్కారు వారి పాట మొదలైంది. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. రేపు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. మరి పరుశురాం కెరీర్ లో ఇప్పటి వరకు తీసిన సినిమాలు మొత్తం 6 కాగా, అందులో నాలుగు సినిమాలు సూపర్ హిట్ అయితే, ఒకటి యావరేజ్ ఇంకొకటి ప్లాప్ గా నిలిచింది. కాబట్టి ఇలా పరుశురాం కెరీర్ రికార్డు చూస్తే 'సర్కారు వారి పాట' ఖచ్చితంగా హిట్ అవుతుందని తెలుస్తోంది.