వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ దళపతి హీరోగా ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా యొక్క పూజా కార్యక్రమాలు ఇటీవలే ఎంతో ఘనంగా జరిగాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతోంది. ఇటీవల విజయ్ దళపతి నటించిన సినిమా బీస్ట్ బాక్సాఫీసు వద్ద ప్రేక్షకులను ఏ మాత్రం మెపించక  పోవడంతో ఈ చిత్రం తప్పకుండా ఘన విజయం సాధించవలసిన సినిమా గా నిలిచింది. ఈ నేపథ్యంలో వంశీ పైడిపల్లి ఈ సినిమాను ఏ విధంగా చేస్తాడో చూడాలి.

అంతకుముందు ఆయన చేసిన మహర్షి సినిమా తెలుగు ప్రేక్షకులనే కాదు అన్ని వర్గాల అన్ని భాషల ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఈ నేపథ్యంలోనే అలాంటి తరహా లోనే ఓ సినిమా చేయాలని వంశీ పైడిపల్లి భావించగా చాలా రోజులు తన కథకు తగ్గ హీరోని వెతికి చివరకు విజయ్ దళపతి ను ఎంపిక చేసుకున్నాడు. ఈ చిత్రం కోసం విజయ్ ఏకంగా వంద కోట్ల పారితోషికాన్ని తీసుకోబోతున్నడం విశేషం. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను మెప్పిస్తదో చూడాలి.

ఈ సినిమాను తెరకెక్కించడానికి ఏ విధంగా కూడా దర్శకుడు వంశీ పైడిపల్లి కాంప్రమైజ్ అవ్వడం లేదని తెలుస్తుంది. లొకేషన్స్ దగ్గర నుంచి కాస్టింగ్ వరకు ప్రతి ఒక్కటి కూడా ఎంతో కొత్తగా ఉండేలా ఆయన చూసుకుంటున్నాడు. ఇంత భారీ లెవల్లో సినిమా తెరకెక్కించడానికి మరింత ఎక్కువ బడ్జెట్ను కూడా కేటాయించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది.  ఇప్పటికే దీనికి సంబంధించిన వివరాలను నిర్మాతకు ఆయన వెల్లడించారు. ఈ సినిమాలో భారీ తారాగణం నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి బాలీవుడ్ నుంచి కోలీవుడ్ నుంచి టాలీవుడ్ నుంచి పలువురు అగ్ర నటీనటులను ఈ సినిమా కోసం ఎంపిక చేయనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: