అందం ఆశ్చర్యపరిచే అభినయంతో ఒకప్పుడు టాప్ హీరోయిన్లుగా వరుస చిత్రాలతో బిజీగా ఉన్న కొందరు హీరోయిన్లు అనూహ్యంగా పలు కారణాల వలన ఇండస్ట్రీకి దూరమై మళ్ళీ ఇటు వైపు చూడకుండా తమ తమ వ్యక్తిగత జీవితాలలో బిజీ అయిపోయారు. ఇదే తరహాలో కలర్స్ స్వాతి, భూమిక, స్నేహ, రేణు దేశాయ్ వంటి ఎందరో నటులు ఉన్నారు. అయితే కొందరు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వైవిధ్యభరిత పాత్రలతో చిత్రాలు చేస్తుండగా మరికొందరు మాత్రం ఇప్పటికీ ఇండస్ట్రీకి దూరంగానే అంటున్నారు. అయితే తమ అభిమాన తారలు మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తే చూసి తరించాలని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కాగా ఇన్నాళ్ల వాళ్ళ ఎదురుచూపులకు ఆనందించే సమయం ఆసన్నమయింది అనే చెప్పాలి.

కొన్నేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న కొందరు స్టార్ హీరోయిన్లు తిరిగి కెమెరా ముందుకు వచ్చి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారు. ఇంతకీ వారెవరో తెలుసుకుందాం పదండి. టాలీవుడ్ లో కంటే కోలీవుడ్ లో ఎక్కువగా సినిమాలు చేసిన సీనియర్ హీరోయిన్ అమల అక్కినేని ఇంటి కోడలుగా మారాక ఇండస్ట్రీకి దూరమైన విషయం తెలిసిందే. దాదాపు 20 ఏళ్ల తరవాత ఈమె మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టారు.  ఆ మద్య లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో కనిపించారు. కానీ అది జస్ట్ ఒక మెరుపు తీగ లాంటి చిన్న పాత్ర . కాగా ఇపుడు ఫుల్ లెంగ్త్ మూవీలో చేసేందుకు రెడీ అయ్యారు అమల. శర్వానంద్ నటిస్తున్న 'ఒకే ఒక జీవితం'  సినిమాలో హీరో శర్వాకి తల్లిగా కనిపించబోతున్నారు అమల అక్కినేని.

అలాగే కలర్స్ స్వాతి కూడా తిరిగి సినిమాల్లోకి రానున్నారు. కెరియర్ మంచి స్పీడ్ పై ఉన్న సమయం లోనే పెళ్లి చేసుకుని ఇండోనేషియాలో సెటిల్ అయిన నటి స్వాతి. ఇపుడు ఈ హీరోయిన్ గా పంచతంత్రం, ఇడియట్స్ వంటి సినిమాలతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి మన ముందుకు వచ్చేస్తున్నారు.

ఇక నటి రేణుదేశాయ్ కూడా రవితేజ చిత్రం టైగర్ నాగేశ్వర్ రావు సినిమాతో ముఖానికి మళ్లీ మేకప్ వేసుకుని షాట్ కి రెడీ అని అనడానికి సిద్దం అయిపోయారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం అయిపోయింది. ఈ చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్నారు రేణు.

గుడుంబా శంకర్ మూవీ ఫేం మీరా జాస్మిన్ కూడా చాలా ఏళ్ళ తర్వాత సినిమాల్లోకి రాబోతున్నారు. రామ్ పోతినేని దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న చిత్రంతో ఈమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు.

ఇక నటి జెనీలియా రీ ఎంట్రీ గురించి చాలా రోజుల నుండి వార్తలు వినియస్తుండగా.. ఇప్పటికీ ఖరారు అయినట్లు అధికారికంగా ప్రకటన వినిపిస్తోంది. గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు హీరోగా నటిస్తున్న సినిమాతో రీ ఎంట్రీకి రెడీ అయిపోయారు జెనీలియా. ఇలా పలువురు హీరోయిన్లు మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తూ అభిమానుల్ని ఖుషి చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే వీరిలో మళ్ళీ బిజీ గా మారే నటులు ఎందరో అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: