మళయాళంలో యాంకర్ కమ్ యాక్ట్రెస్గా ఇంప్రెస్ చేస్తోంది రజీషా విజయన్. బుల్లితెర నుంచి వెండితెరపైకి వచ్చి ఉత్తమ నటిగా అవార్డులు అందుకున్న రజీషా, టాలీవుడ్లోనూ టాలెంట్ చూపించడానికి సిద్ధమవుతోంది. రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాతో తెలుగులో లాంచ్ అవుతోంది రజీషా. ఇక ఈ సినిమాలో దివ్యాంశ కౌషిక్ మరో హీరోయిన్గా చేస్తోంది. జూన్ 17న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది.
తమిళ్ బ్యూటీ సమంత లుక్స్తో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చింది మల్లూ బేబి సంయుక్త మీనన్. 'భీమ్లానాయక్' రానా జోడీగా నటించిన సంయుక్తకి తెలుగులో మల్టిపుల్ ఆఫర్స్ వస్తున్నాయి. కళ్యాణ్రామ్ 'బింబిసార'లో ఒక హీరోయిన్గా చేస్తోంది. వీటితో పాటు ధనుష్, వెంకీ అట్లూరి కాంబినేషన్లో తెలుగు, తమిళ్ బైలింగ్వల్గా వస్తోన్న 'సార్'లో మెయిన్ హీరోయిన్గా చేస్తోంది సంయుక్త.
మళయాళీ హీరోయిన్లు ఎక్స్పోజింగ్కి దూరంగా ఉంటారు గానీ, యాక్టింగ్లో టాప్ లేపుతారని ఒక టాక్ ఉంది. అందుకే పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ కోసం చాలామంది మేకర్స్ మళయాళీ హీరోయిన్లనే కాంటాక్ట్ చేస్తుంటారు. ఆల్రెడీ టాలీవుడ్లో ఉన్న మళయాళీ హీరోయిన్లు చాలామంది ఈ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ స్టార్ లీగ్లో జాయిన్ అయ్యారు.
ప్రజెంట్ జనరేషన్లో బెస్ట్ యాక్టర్స్ అనగానే టాప్లో కనిపించే పేరు కీర్తి సురేశ్. 'మహానటి'తో ఉత్తమనటిగా నేషనల్ అవార్డ్ అందుకున్న కీర్తి, తెలుగు, తమిళ్, మళయాళీ సినిమాల్లో హంగామా చేస్తోంది. స్టార్ లీగ్లో బెంగళూరు బ్యూటీస్ పూజా హెగ్డే, రష్మిక మందన్న కంటే కొంచెం వెనకబడినా, స్పెషల్ ఇమేజ్ మాత్రం సంపాదించుకుంది. ప్రస్తుతం మహేశ్తో 'సర్కారు వారి పాట', నానితో 'దసరా' సినిమాలు చేస్తోంది.
ఎమ్.ఎల్.ఎ. అనే మాటకి కొత్త అర్థం తీసుకొచ్చింది మళయాళీ బ్యూటీ కేథరీన్ థ్రేసా. యూత్కి లవ్లీ ఏంజెల్గా కనెక్ట్ అయిన ఈ హీరోయిన్ తెలుగులో మల్టిపుల్ మూవీస్ చేస్తోంది. కళ్యాణ్ రామ్ హిస్టారికల్ డ్రామా 'బింబిసార'లో ఒక హీరోయిన్గా చేస్తోంది. అలాగే నితిన్ యాక్షన్ ఫిల్మ్ 'మాచర్ల నియోజకవర్గం'లో సెకండ్ హీరోయిన్గా చేస్తోంది.