ఎప్పుడేప్పుడా అని ఎదురు చూస్తున్న మహేష్ ఫ్యాన్స్ నిరీక్షణ ఈరోజు తీరింది.మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు రిలీజ్ అయ్యింది..మహేష్ బాబు,డైరెక్టర్ పరూశురామ్ కాంబినెషన్ లో ఈ సినిమా తెరకెక్కింది. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది.ఈ సినిమా లో మహేష్ బాబు స్తైలిష్ లుక్ లో కనిపించారు.దాంతో ఫ్యాన్స్ ఆసక్థిగా ఎదురు చూసారు.మొత్తానికి ఈరోజు ఉదయం థియెటర్లలో విడుదల అయ్యింది. మొదటి షో తోనే పాజిటివ్ టాక్ ను అందుకుంది..కథ పరంగా అందరినీ ఆకర్షించింది.


అయితే ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచానాలు నెలకొన్నాయి. ఇక తెలంగాణాలో బెనిఫిట్ షోలకి కూడా పర్మిషన్ ఇవ్వడంతో హైదరాబాద్ లోని కొన్ని థియేటర్ల లో ఇప్పటికే బెనిఫిట్ షోలు పడ్డాయి. మహేష్ అభిమానులు ఆయా థియేటర్ల వద్ద రాత్రి నుంచే హంగామా చేస్తున్నారు..గత రెండు రోజుల నుంచి ఈ సినిమా కోసం ఫ్యాన్స్ థియెటర్లను అందంగా ముస్తాబును చేసారు..భారీ ఫ్లెక్సీ లతో రచ్చ రచ్చ చేశారు.ప్రీరిలిజ్ ఈవెంట్ తో పాటు, ప్రీరిలిజ్ బిజినెస్ కూడా సినిమాకు బాగా కలిసి వచ్చింది.మంచి హైప్ ను క్రియేట్ చేసింది.


ఇకపొతే మహేష్ భార్య నమ్రత శిరోద్కర్ హైదరాబాద్ భ్రమరాంబ థియేటర్లో అభిమానులతో కలిసి సినిమా చూసింది. నమ్రతతో పాటు సర్కారు వారి పాట సినిమా టీం, అనిల్ రావిపూడి కూడా థియేటర్ కి వచ్చారు. నమ్రతని చూసి ఫ్యాన్స్ ఫోటోల కోసం ఎగబడ్డారు. థియేటర్ వద్ద జై బాబు జై జై బాబు అంటూ ఫ్యాన్స్ హంగామా చేశారు. బెనిఫిట్ షోలకి అభిమానులు భారీగా తరలి వచ్చారు..సర్కారు వారి పాట సినిమాను చూసి,కేకల తో హంగామా చేశారు.ఇప్పటివరకు పాజిటివ్ టాక్ ను అందుకుంది. మరో షో కు ఎటువంటి టాక్ ను , కలెక్షన్స్ ను అందుకుంటుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: