బుల్లి తెర యాంకర్స్ లో టాప్ యాంకర్ లలో శ్రీముఖి కూడా ఒకటి..ఈ అమ్మడు పేరుకు పరిచయం అక్కర్లేదు..ఒకవైపు షోలు, మరో వైపు సినిమాలు, ఆడియో ఫంక్షన్స్ ఇలా ఒకటేమిటి ఏది దొరికిన స్టేజ్ ఎక్కితే అమ్మడు రచ్చ మాములుగా ఉండదు. పటాస్' కామెడీ షోతో శ్రీముఖి తెలుగు టెలివిజన్ ఆడియెన్స్ కు మరింత దగ్గరైంది.ఈ షోతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బుల్లి తెర రాములమ్మగా పేరొందింది. ఇప్పుడు బుల్లితెర షోలు చేస్తూనే మరోవైపు వెండితెరపై కూడా అదృష్టం పరీక్షించుకుంటూ ఉంటుంది.


'జులాయి' సినిమాలో బన్నీ చెల్లులు పాత్ర పోషించిన శ్రీముఖి అప్పటి నుంచి ఏదోక సినిమాలో కనిపిస్తూనే వస్తోంది. ఇలా అటు బుల్లితెరపై పలు షోలతో నవ్వులూ పూయిస్తూనే.. మరోవైపు బిగ్ స్క్రీన్ పై మెరిసేందుకు ప్రయత్నిస్తోంది..ఇకపొతే ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా చురుగ్గా ఉంటుందన్న విషయం తెలిసిందే.శ్రీముఖి ఇటీవల తన 29వ బర్త్‌డేని ఘనంగా జరుపుకుంది. తన సన్నిహితులు, కుటుంబ సభ్యులతో కలిసి బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది. తన సోదరుడు, అమ్మ, స్నేహితుల మధ్య పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంది. ఆ ఫొటోలను తన అభిమానులతో పంచుకుంది.

 

బొద్దుగా ఉండే శ్రీముఖి బాగా సన్నగా అయిన విషయం తెలిసిందే.తాజాగా శ్రీముఖి సన్నని నడుము చూపిస్తూ మతులు పోగొట్టే విధంగా చిందులు వేసింది.ఒక డ్యాన్స్ తో కోట్ల మంది అభిమానుల మనసును ఆకట్టుకుంటూ వస్తుంది.గత ఏడాది ఆమె ‘క్రేజీ అంకుల్స్’, నితిన్ ‘మాస్ట్రో’లో సైతం ముఖ్యమైన పాత్రలో కనిపించి పేరు తెచ్చుకుంది. అలాగే, ఇప్పుడు ‘భోళా శంకర్’ సహా ఎన్నో సినిమాల్లో నటిస్తూ బిజీ అయింది.సోషల్ మీడియాలో శ్రీముఖి ఎక్కువగా ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తోంది. అందులో గ్లామర్ ట్రీట్‌ ఇస్తూ హాట్ టాపిక్ అవుతోంది..మొత్తానికి పాప చాలా బిజీగా ఉందని తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: