విశ్వక్ సేన్ హీరోగా చేసిన 'అశోకవనంలో అర్జున కళ్యాణం' సినిమా ఈ నెల 6వ తేదీన రికార్డు స్థాయి థియేటర్లలో సాధారణ టికెట్ రేట్లతో విడుదలై క్రిటిక్స్ నుంచి, ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ ను, అలాగే పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ సినిమాకు ఫస్ట్ వీకెండ్ లోనే చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లు రాగా సెకండ్ వీకెండ్ ను కూడా క్యాష్ చేసుకుంటుందని ఫ్యాన్స్ భావించారు. అయితే ఇప్పుడు ఈ సినిమా కొన్ని థియేటర్లలో కనిపించడం లేదు. కాగా మహేష్ హీరోగా తెరకెక్కిన 'సర్కారు వారి పాట' సినిమా కోసం కొన్ని థియేటర్లను ఈ సినిమా త్యాగం చేయవలసి వచ్చింది.

అంతేకాదు ఆచార్య, కేజీఎఫ్2 సినిమాలను కూడా ఇంకా కొన్ని  థియేటర్లలో ప్రదర్శిస్తుండటంతో ఈ  సినిమాకు థియేటర్ల విషయంలో తీరని అన్యాయం జరుగుతోందని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. కాగా అశోకవనంలో అర్జున కళ్యాణం ఇప్పటికీ బ్రేక్ ఈవెన్ కాలేదు. అయితే థియేటర్ల సంఖ్య పెంచితే మాత్రం ఈ సినిమా తప్పకుండా బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ కచ్చితంగా ఉంటుంది. అంతేకాదు చిన్న చిన్న సినిమాలను బ్రతికించాలనే ఇదితో నిర్మాతలు ఈ సినిమాపై కాస్త దృష్టి పెడితే బాగుంటుందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వీకెండ్ లో ఎవరైనా ఈ సినిమాను చూడాలని భావిస్తున్నప్పటికీ తమకి దగ్గర్లోని థియేటర్ లో ఈ సినిమాను ప్రదర్శించక పోవటం చాలా బాధాకరం అని మరి కొందరు చెబుతున్నారు.

అంతేకాక ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యే విధంగా ఉన్న ఈ సినిమా ఇంత తక్కువ థియేటర్లతో ఫుల్ రన్ లో ఇక ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో వేచి చూడాలి. ఇది ఇలా ఉంటే మరోవైపు ఈ సినిమా యొక్క ఓటీటీ స్ట్రీమింగ్ కు సంబంధించి రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చినా కూడా ఆ వార్తలను విశ్వక్ సేన్ ఖండించారు. అయితే  ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందో అలాగే ఎప్పటినుంచి స్ట్రీమింగ్ కానుంది అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. అంతేకాదు ఏపీలో ఇలాంటి చిన్న చిన్న సినిమాలకు ఒక షో కేటాయించాలననే నిబంధనలు ఉన్నప్పటికీ ఆ నిబంధనల విషయంలో చాలా  కూడా కన్ఫ్యూజన్ ఉంది. మరి ఈ సినిమాకు ఎప్పటికి అన్ని థియేటర్ లలో స్థానం దక్కుతుందో  లేదో చూడాలి.

 
 


మరింత సమాచారం తెలుసుకోండి: