స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ సినిమా 'పుష్ప' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ కూడా తెలిసిందే.ఇక ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన తీరు అయితే చాలా అందంగా ఇంకా అత్యద్భుతంగా ఉండటంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిని చూపారు. మొదట ఒక వారం దాకా మిక్స్డ్ టాక్ తో చాలా స్లో గా ఆడిన ఈ సినిమా ఆ తరువాత క్రమ క్రమంగా జనాలకు బాగా ఎక్కేసింది. థియేటర్ లలో హిట్ అయ్యిందో లేదో తెలీదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి అనేకమంది అభిమానులని సంపాదించుకుంది.ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప2 సినిమాని త్వరలోనే పట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఇప్పటికే డైరెక్టర్ సుకుమార్సినిమా స్క్రిప్టు పనులపై పూర్తి ఫోకస్ పెట్టాడు. ఇక సినిమా షూటింగ్ ను కూడా వీలైనంత త్వరగా పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.అయితే ఇక ఈ సినిమా కోసం సుకుమార్ భారీగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది. దీనికోసం ఈ సినిమాను మొదటి భాగం కంటే కూడా అత్యంత భారీ బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేసేందుకు సినిమా యూనిట్ రెడీ అవుతుందట.



అంతేగాక ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో మరింత పాపులర్ చేసేందుకు ఇతర ఇండస్ట్రీలకు చెందిన పలువురు స్టార్ నటీనటులను కూడా ఈ సినిమాలో తీసుకునేందుకు సుకుమార్ ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం తెలుస్తోంది. దీంతో పుష్ప సినిమా కేవలం దక్షిణాదినే కానకుండా ఉత్తరాదిన కూడా మంచి రెస్పాన్స్ ను అందుకుంటుందని ఆయన ఎంతగానో భావిస్తున్నాడు.ఇక ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మంచి రఫ్ లుక్ ఇంకా ఊరమాస్ లుక్ ఇప్పటికే ప్రేక్షకులను కట్టిపడేయగా, ఆయన ఈ సినిమాలో తగ్గేదే లే.. అంటూ చేసిన మేనరిజం అయితే ఇప్పటికీ పలువురు సెలబ్రిటీలు ఫాలో అవుతూ ఇంకా ఆ ట్రెండ్ ను కంటిన్యూ కూడా చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుండగా,రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు అత్యంత భారీ బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: