సూపర్ స్టార్ మహేష్, సూపర్ హీరోయిన్ కీర్తి సురేష్ ల తొలి కలయికలో తెరకెక్కిన సర్కారు వారి పాట మూవీ రెండు రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అందరిలో మొదటి నుండి మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ సినిమా మహేష్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ని కూడా అలరిస్తోంది. వాస్తవానికి మొదట ఈ సినిమాకి యావరేజ్ అనే టాక్ వినిపించింది.

అయితే మొదటి రోజు అన్ని ఆటలు ముగిసిన అనంతరం మెల్లగా టాక్ పుంజుకోవడంతో పాటు రెండవ రోజు కూడా చాలా ఏరియాల్లో సర్కారు వారి పాట అదరగొట్టినట్లు చెప్తున్నారు ట్రేడ్ పండితులు. మహేష్ బాబు అదరగొట్టే పెర్ఫార్మన్స్ తో పాటు కీర్తి సురేష్, అందం, అభినయం ఈ సినిమా కి మంచి ప్లస్ అయ్యాయని అంటున్నారు ఆడియన్స్. ఇక దర్శకుడు పరశురామ్ పెట్ల మూవీని తెరకెక్కించిన తీరు బాగుందని, అయితే అక్కడక్కడా సినిమాలో కొద్దిపాటి లోపాలు ఉన్నప్పటికీ ఓవరాల్ గా మూవీ మాత్రం ఎంతో బాగుందని పలువురు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

నిజానికి సర్కారు వారి పాట పై నిన్న కొంత సోషల్ మీడియాలో నెగటివ్ ట్రెండ్ నడిచినప్పటికీ కూడా సినిమాలో దమ్ము ఉంటె అవన్నీ సక్సెస్ ని ఆపలేవు అనే విధంగా రాబోయే రోజుల్లో ఈ సినిమా మంచి కలెక్షన్ అందుకునే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు. మరోవైపు రేపు, ఎల్లుండి వారాంతం కావడంతో ఈ రెండు రోజులు కూడా సర్కారు వారి పాట అదరగొట్టే ఛాన్స్ ఉందని, ప్రస్తుత టాక్ ని బట్టి చూస్తే సోమవారం నుండి కొంత కలెక్షన్స్ తగ్గినప్పటికీ ఓవరాల్ గా బాగానే రాబట్టే అవకాశం లేకపోలేదని అంటున్నారు. మొత్తంగా టాక్ తో సంబంధం లేకుండా పలు ఏరియాల్లో సర్కారు వారి పాట మూవీ మంచి కలెక్షన్స్ వేట కొనసాగిస్తోందని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: