అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆచార్య సినిమా విషయంలో చేసిన తప్పే ఇప్పుడు చేతిశున్నారని అప్పుడే సినిమా పరిశ్రమలో టాక్ వస్తోంది. ఇప్పుడు తీస్తున్న సినిమాలలో మార్పులు చేర్పులు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంలో డైరెక్ట్ గా చిరంజీవి వేలు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే లూసిఫర్ రీమేక్ చిత్రీకరణా చివరికి దశలో ఉంది. కాబట్టి ఇందులో మార్పులు చేసే ప్రయోగం చేయరని తెలుస్తోంది. ఇక వేదాళం రీమేక్ గా వస్తున్న భోళా శంకర్ పైనే ఇతని దృష్టి ఉంది.
అందుకే ఇందులో మార్పులు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. కానీ ఆచార్య సినిమా ఫెయిల్ అవ్వడానికి కారణం మెగా హీరోల జోక్యం అని వార్తలు హల్ చల్ చేస్తున్న నేపథ్యంలో మళ్ళీ చిరంజీవి ఇందులో మార్పులు చేస్తే ఎక్కడా తేడా కొడుతుందో అని ఫ్యాన్స్ అంతా కంగారులో ఉన్నారట. మెహర్ రమేష్ ఎఫర్ట్ పెట్టి కంటెంట్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఫలితం ఉండే అవకాశం ఉంది. మరి ఏమి జరగనుందో చూడాలి.