సూపర్ స్టార్ మహేష్ బాబు కు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరియర్ లో ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలలో  నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నాడు.  టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరో లలో ఒకరిగా  కొనసాగుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సినిమాలు దాదాపుగా మొదటి రోజు అదిరిపోయే కలెక్షన్లను బాక్సాఫీసు దగ్గర వసూలు చేస్తూ ఉంటాయి.  అందులో భాగంగా మహేష్ బాబు నటించిన ఆఖరి నాలుగు సినిమాల మొదటి రోజు  కలెక్షన్ల గురించి తెలుసుకుందాం.
 
సర్కారు వారి పాట : మహేష్ బాబు హీరో గా కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సర్కారు వారి పాట మూవీ మొదటి రోజు 45.21 కోట్ల షేర్ కలెక్షన్లను బాక్సాఫీస్ దగ్గర వసూలు చేయగా, 70 కోట్ల గ్రాస్ కలెక్షన్లను బాక్సాఫీసు దగ్గర వసూలు చేసింది.


సరిలేరు నీకెవ్వరు : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర  43.16 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేయగా,  67 కోట్ల గ్రాస్ కలెక్షన్లను బాక్సాఫీస్ దగ్గర వసూలు చేసింది.


భరత్ అనే నేను : మహేష్ బాబు హీరోగా కీయారా అద్వానీ హీరోయిన్ గా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన భరత్ అనే నేను సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర 35.20 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేయగా,  55 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించండి.


మహర్షి : మహేష్ బాబు హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన మహర్షి సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర  32.2 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేయగా, 48.2 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: