బాలీవుడ్ లో దిగ్గజ నటులలో హీరో అక్షయ్ కుమార్ కూడా ఒకరు. ఈయనకు తాజాగా రెండవసారి కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అక్షయ్ కుమార్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు దూరంగా ఉన్నట్లుగా సమాచారం. ఈ సమాచారాన్ని స్వయంగా తన ట్విట్టర్ నుంచి తెలియజేయడంతో ప్రతి ఒక్కరు భయభ్రాంతులకు గురవుతున్నారు. గత ఏడాది ఏప్రిల్ లో కూడా  హీరో అక్షయ్ కుమార్ కరోనా బారిన పడిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ హీరోతో పాటు మ్యూజిక్ మాస్ట్రో ఏ ఆర్ రెహమాన్, మాధవన్, నయనతార, తమన్నా వీరందరూ కూడా రెడ్ కార్పెట్ పై ఉన్న వారే

ఇక అక్షయ్ కుమార్ కి కరోనా పాజిటివ్ అని స్వయంగా తన ట్విట్టర్ ద్వారా వెల్లడించడం తో ఆయన అభిమానులు సైతం ఆయన త్వరగా ఈ మహమ్మారి నుండి బయట పడాలని కోరుకుంటున్నారు. వాస్తవానికి ఈ ఏడాది కేన్స్ ఫెస్టివెల్ కోసం ఎంతోమంది చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. వారిలో నేను కూడా ఒకరిని.. కానీ కరోనా పాజిటివ్ రావడంతో పాల్గొన్న లేక పోతున్నాను.. మీ టీమ్ మొత్తానికి  శుభాకాంక్షలు తెలియ అంటూ తెలియజేశారు అక్షయ్ కుమార్.

నిజానికి నేను అక్కడ ఉండే అవకాశాన్ని కోల్పోయాను అంటూ ఎంతో బాధతో ట్వీట్ చేసినట్లుగా కనిపిస్తోంది. అక్షయ్ కుమార్ తన కొత్త చిత్రం పృథ్విరాజ్ సినిమా ప్రమోషన్ లో చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇందులో పృథ్విరాజ్ చౌహాన్ జీవితం, వీరత్వం ఆధారంగా తెరకెక్కించడం జరుగుతోంది. ఇందులో మహమ్మద్ గారికి వ్యతిరేకంగా పోరాడి కొన్ని సన్నివేశాల్లో అక్షయ్ కుమార్ కనిపించబోతున్నాడు. ఈ చిత్రం జూన్ 3వ తేదీన అన్ని భాషలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి చిత్ర బృందం. ఏదిఏమైనా కరోనా మహమ్మారి పూర్తిగా ఇంకా పోలేదని వార్త ఇప్పుడు ఎక్కడ చూసిన బాగా వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: