టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ వున్న దర్శకులలో ఒకరు అయిన పరశురామ్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దర్శకుడు పరశురామ్ , నిఖిల్ సిద్దార్థ్ హీరోగా తెరకెక్కిన యువత సినిమాతో దర్శకుడిగా కెరియర్ ను మొదలు పెట్టాడు.  ఆ తర్వాత ఆంజనేయులు , సోలో , సారొచ్చారు ,వ శ్రీరస్తు శుభమస్తు ,  గీత గోవిందం వంటి సినిమాలకు పరశురామ్ దర్శకత్వం వహించాడు.  పరశురామ్ దర్శకత్వం వహించిన సినిమాల్లో ఎక్కువ శాతం సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలను సాధించాయి.

ఇది ఇలా ఉంటే పరశురామ్ దర్శకత్వం వహించిన గీత గోవిందం సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఈ దర్శకుడు కు ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్ లభించింది. అందులో భాగంగా పరుశురామ్,  సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సర్కారు వారి పాట సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా మే 12 వ తేదీన గ్రాండ్ గా థియేటర్ లలో విడుదల అయ్యింది. ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా థియేటర్ లలో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా పరశురామ్ కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతుంది.  

గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమాకు దర్శకత్వం వహించిన పరశురామ్ సర్కారు వారి పాట సినిమా కోసం 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నాడు అని ఒక వార్త తెగ వైరల్ అవుతుంది.  ఈ వార్తను తెలుసుకున్న కొంత మంది గీతా గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కాబట్టి ఆరెంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకోవడం పెద్ద విషయమేమీ కాదు అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: