నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వం లో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. బాలకృష్ణ , గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా 'ఎన్ బి కె 107'  వర్కింగ్ టైటిల్ తో ప్రస్తుతం చిత్రీకరణ ను జరుపుకుంటోంది.  ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది.  ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఈ మూవీ ని  మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు.  ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది. 

అసలు విషయం లోకి వెళితే... బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్న 'ఎన్ బి కె 107'  మూవీ లో అందాల ముద్దుగుమ్మ శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ లో శృతి హాసన్ తో పాటు మరొక హీరోయిన్ కూడా ఉండబోతుంది అని ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. అందులో భాగంగా 'ఎన్ బీ కే 107'  మూవీ లో రెండవ హీరోయిన్ గా చిత్ర బృందం మలయాళీ ముద్దుగుమ్మ హాని రోజ్ ను తీసుకోనున్నట్లు ఒక వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. 

ఇప్పటి వరకు ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇది ఇలా ఉంటే 'ఎన్ బీ కే 107'  మూవీ లో దునియా విజయ్ ప్రతినాయకుడి పాత్ర లో కనిపించనుండగా,  వరలక్ష్మి శరత్ కుమార్ ఒక పాత్రలో కనిపించబోతుంది. ఈ మూవీ లో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: