పాన్
ఇండియా స్టార్
ప్రభాస్ ఇప్పుడు తన సినిమాలతో పాన్
ఇండియా ప్రేక్షకులను ఎంతగానో అలరించడానికి సిద్ధమవుతున్నాడు.
బాహుబలి సాహో రాధే
శ్యామ్ వంటి చిత్రాల ద్వారా ఆయన పాన్
ఇండియా మార్కెట్లో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే రాబోయే సినిమాలతో మరింత మంది ప్రేక్షకులను అలరించాలని భావిస్తున్నాడు. వరుస ఫ్లాపులు వచ్చినా కూడా
ప్రభాస్ ఇమేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు అంటే ఆయనకు ఏస్థాయిలో గుర్తింపు ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఆ విధంగా ఆయన
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయబోతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నాడు. ఈ
సినిమా షూటింగ్ మొదలు పెట్టి చాలా రోజులు అవుతున్నా కూడా
కరోనా కారణంగా ఈ సినిమాను పూర్తి చేయలేకపోయారు. ఈ ఏడాది సమ్మర్లో విడుదల కావాల్సిన ఈ
సినిమా ఇప్పటిదాకా విడుదల కాకపోవడానికి కారణం ఇదే. ఈ నేపథ్యంలో కేవలం 30 శాతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ
సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అని అసహనాన్ని
ప్రభాస్ అభిమానులు వ్యక్త పరిచారు.
వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ
సినిమా విడుదల అవుతుంది అని వారు భరోసా ఇస్తూ ఉండడం విశేషం. ఈ అప్ డేట్ ను
ప్రభాస్ అభిమానులు సైతం స్వీకరించారని చెప్పాలి. ఈ సినిమాను
సంక్రాంతి కి విడుదల చేయాలని సూచన చేస్తున్నారు. అయితే అపుడు
ఆది పురుష్
సినిమా ను విడుడల చేస్తూ ఉండడం తో ఈ
సినిమా విడుదల కష్టమే అని చెప్పాలి. మరి
మారుతి తో మొదలుపెట్టే
సినిమా నైనా
ప్రభాస్ ఈ ఏడాది విడుదల చేస్తాడా చూడాలి. ఇప్పటికే ఈ
సినిమా స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని చెప్తున్నారు. జూలై లో ఈ
సినిమా ను మొదలుపెట్టి
నవంబర్ లో విడుదల చేయడానికి దర్శకుడు సన్నాహాలు చేస్తున్నాడు.