పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు తన సినిమాలతో పాన్ ఇండియా ప్రేక్షకులను ఎంతగానో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. బాహుబలి సాహో రాధే శ్యామ్ వంటి చిత్రాల ద్వారా ఆయన పాన్ ఇండియా మార్కెట్లో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే రాబోయే సినిమాలతో మరింత మంది ప్రేక్షకులను అలరించాలని భావిస్తున్నాడు. వరుస ఫ్లాపులు వచ్చినా కూడా ప్రభాస్ ఇమేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు అంటే ఆయనకు ఏస్థాయిలో గుర్తింపు ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఆ విధంగా ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయబోతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టి చాలా రోజులు అవుతున్నా కూడా కరోనా కారణంగా ఈ సినిమాను పూర్తి చేయలేకపోయారు. ఈ ఏడాది సమ్మర్లో విడుదల కావాల్సిన ఈ సినిమా ఇప్పటిదాకా విడుదల కాకపోవడానికి కారణం ఇదే. ఈ నేపథ్యంలో కేవలం 30 శాతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అని అసహనాన్ని ప్రభాస్ అభిమానులు వ్యక్త పరిచారు.

వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా విడుదల అవుతుంది అని వారు భరోసా ఇస్తూ ఉండడం విశేషం. ఈ అప్ డేట్ ను ప్రభాస్ అభిమానులు సైతం స్వీకరించారని చెప్పాలి.  ఈ సినిమాను సంక్రాంతి కి విడుదల చేయాలని సూచన చేస్తున్నారు. అయితే అపుడు ఆది పురుష్ సినిమా ను విడుడల చేస్తూ ఉండడం తో ఈ సినిమా విడుదల కష్టమే అని చెప్పాలి. మరి మారుతి తో మొదలుపెట్టే సినిమా నైనా ప్రభాస్ ఈ ఏడాది విడుదల చేస్తాడా చూడాలి. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని చెప్తున్నారు. జూలై లో ఈ సినిమా ను మొదలుపెట్టి నవంబర్ లో విడుదల చేయడానికి దర్శకుడు సన్నాహాలు చేస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: