ప్రస్తుతం దేశంలో అందరికంటే ఎక్కువగా పారితోషకం తీసుకుంటున్న హీరోలు ఎవరంటే సౌత్ ఇండియా సినిమా పరిశ్రమకు చెందిన హీరోలు అనే చెప్పాలి. బాహుబలి సినిమా తర్వాత ఈ రకమైన పారితోషకాలు మన సౌత్ హీరోలు అందుకుంటున్నారు. కారణం ఏదైనా కూడా సౌత్ హీరోల సినిమాలకు ఇప్పుడు దేశవ్యాప్తంగా భారీ డిమాండ్ నెలకొని ఉండడంతో ఈ రకమైన రెమ్యునరేషన్ ఇచ్చి నిర్మాతలు ఆయా హీరోలతో సినిమాలు చేస్తున్నారు.

దేశంలోని అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోగా ప్రభాస్ రికార్డు నెలకొల్పుతున్నారు. వంద కోట్లకు పైగా పారితోషకాన్ని అందుకుంటూ ఇప్పటిదాకా ఇండియన్ హీరో సృష్టించనీ విధంగా సెన్సేషన్ సృష్టిస్తున్నాడు. ఆయన సినిమాలు ఏకంగా 200 కోట్ల నుంచి 300 కోట్ల వరకు బడ్జెట్ ను కేటాయిస్తూ ఉండడంతో ఆయనకు ఏర్పడ్డ మార్కెట్ కారణంగా ఇంతటి స్థాయిలో పారితోషకాలు ఆయన కు చెబుతున్నారు నిర్మాతలు.

ఏదేమైనా ప్రభాస్ ఎంతోమంది హీరోలకు మార్గదర్శకంగా నిలబడ్డాడు అని చె ప్పాలి. ఆ తర్వాత అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోగా యశ్, విజయ్ దళపతి ఉన్నారని చెప్పవచ్చు. కే జి ఎఫ్ సినిమా తో సంచలన విజయాలు నమోదు చేసుకున్న యశ్ ప్రభాస్ తర్వాత అంతటి పారితోషకాన్ని అందుకోవడానికి అర్హుడు అయ్యాడు. ఆయన సినిమాకు దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో డిమాండ్ ఏర్పడింది. ఆ తరువాత విజయ్ దళపతి కూడా ఇండి యా వైడ్ గా మార్కెట్ ఉండడంతో ఈ స్థాయిలో ఆయనకు పారితోషికం ఇవ్వడానికి నిర్మాతలు ముందుకు వచ్చారు. తాజాగా ఆయన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్న సినిమా కి దిల్ రాజు వంద కోట్ల పారితోషికాన్ని చెల్లిస్తున్నారు. వీరు మాత్రమే కాదు మిగితామంది హీరోలు కూడా ఈ స్థాయి లో రెమ్యునరేషన్ తీసుకోవడానికి పోటీ పడుతున్నారు. త్వరలోనే వారు కూడా ఈ స్థాయి లో రెమ్యునరేషన్ అందుకోవడం ఖాయం. 

మరింత సమాచారం తెలుసుకోండి: