బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు కామెడీ షో లలో జబర్దస్త్ కామెడీ షో ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఈ షో  ద్వారా ఎంతో మంది కమెడియన్ లు తమ  ఇమేజ్ ను సంపాదించుకునీ.. సినిమాలలో అవకాశాలు సంపాదించుకుంటూ డబ్బు బాగా  సంపాదిస్తున్నారు. ఇకపోతే తాజాగా జబర్దస్త్ లో కామెడీ గా పనిచేస్తున్న పరదేశి గురించి కూడా మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పరదేశి జబర్దస్త్ షో లో కనిపించే ఆర్టిస్టుగా కంటే వైజాగ్ ఘటనలో పట్టుబడ్డ ఒక నటుడిగా బాగా ఫేమస్ అయ్యాడు. ఇక వ్యభిచార  గృహంలో పట్టుబడ్డ విటులుగా.. దొరబాబు, పరదేసీ ఎంతగా పాపులర్ అయ్యారో ప్రతి ఒక్కరికి తెలిసిందే.

అయితే వైజాగ్ ఘటన నుంచి హైపర్ ఆది వాళ్ళిద్దర్నీ తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి బయటకు తీసుకురావడం జరిగింది. అయితే ఆ తర్వాత జబర్దస్త్ షో లో వీళ్ళిద్దరికీ అవకాశాలు ఉండవు అని అంతా అనుకున్నారు. కానీ ఆ ఇద్దరిని ఆది స్కిట్ లో పెట్టుకోవడం జరిగింది. ఇక ఆ ఘటన మీదే స్కిట్ లు రాసుకుంటూ.. సెటైర్లు వేసుకుంటూ ముందుకు వచ్చారు. పరదేశి మీద ఎప్పుడూ కూడా వైజాగ్ సంఘటనను ప్రస్తావిస్తూ సెటైర్లు వేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే.  ఒక్కోసారి ఆ సంఘటనలు మితిమీరిపోతూ ఉంటాయి.  కానీ ఆ ఇద్దరూ ఏమాత్రం పట్టించుకోక పోవడం గమనార్హం.

అంతేకాదు వీరిద్దరు చెప్పే మాటలు ఏమిటంటే.. అలా ఆది కౌంటర్లు వేసినప్పుడే తాము మరింతగా ఫేమస్ అవుతాము అని చెబుతూ ఉంటారు. ఒక స్కిట్ లో భాగంగా పరదేశి కొన్ని కామెంట్లు చేశారు.. ఇక ఈ క్రమంలోనే మాంత్రికురాలు గా రోహిణి కనిపించింది. దెయ్యం పట్టిన వాడిలా పరదేశి నటించాడు. ఇక ఈ క్రమంలోనే రోహిణి వీడి మీద ఇంకా ఏదో కేసు ఉంది అని రోహిణి అనగానే..  అప్పుడు పరదేశి అవును నా మీద ఇంకా రెండు కేసులు ఉన్నాయి.. ఇంకా వాటిని కొట్టి వేయలేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: