తెలుగు సినీ ఇండస్ట్రీలో మహానటిగా కీర్తి సురేష్ కు.. బుట్టబొమ్మగా పూజా హెగ్డే కి ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే . ఇక ఇద్దరూ కూడా స్టార్ హీరోయిన్ గా చెలామణి అవడమే కాకుండా పాన్ ఇండియా హీరోయిన్లుగా చలామణి అవ్వడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.  ఇకపోతే స్టార్ ఇమేజ్ ను  సంపాదించుకున్న  నేపథ్యంలో ఐటమ్ సాంగులు చేయడానికి కూడా వెనుకాడడం లేదు అన్న విషయం తెలిసిందే. అయితే కీర్తి సురేష్ గురించి పక్కన పెడితే పూజా హెగ్డే ఇటీవల ఐటమ్ సాంగ్లో మెరవడానికి సిద్ధమవుతోంది . రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ తో కలిసి ఐటం సాంగులో జిగేలు రాజా అంటూ మెరిసిన ఈ ముద్దుగుమ్మ,  ఇప్పుడు ఎఫ్ 3 సినిమాలో కూడా మరొక ఐటమ్ సాంగ్ చేయడానికి సిద్ధమైంది.

ఇదిలా ఉండగా ప్రస్తుతం కీర్తి సురేష్ అలాగే పూజా హెగ్డే ఇద్దరూ కూడా చెల్లెలు క్యారెక్టర్లో చేయడానికి సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదివరకే కీర్తిసురేష్ పెద్దన్న , భోళా శంకర్ వంటి సినిమాలలో అటు రజినీకాంత్ కి ,  ఇటు చిరంజీవికి చెల్లెలు పాత్ర పోషించడానికి సిద్ధమైంది. అంతే కాదు ఆమె చిరంజీవితో కలిసి చెల్లి గా నటించడానికి కారణం ఆ పాత్ర బాగా నటించింది అని.. ఇక రజనీకాంత్ సినిమాలో ఛాన్స్ వస్తే చాలు అనుకొని చెల్లెలు పాత్ర చేయడానికి ఒప్పుకున్నాను అని ఆమె తెలిపింది. ఇక ఆ తర్వాత చెల్లెలి పాత్రలే వస్తాయని తన భయపడలేదు అని .. పాత్ర నచ్చింది కాబట్టే చేశాను అని.. ఇక మహేష్ సినిమాతో హీరోయిన్ గా మంచి ఇమేజ్ ను కూడా సొంతం చేసుకుంది.


ఇక ఇదిలా ఉండగా పూజా హెగ్డే తాజాగా విక్టరీ వెంకటేష్ -  సల్మాన్ ఖాన్ కాంబినేషన్ లో బాలీవుడ్లో మల్టీస్టారర్ మూవీ వస్తున్న విషయం తెలిసిందే . ఇక ఈ సినిమాలో వెంకటేష్ కి చెల్లెలు పాత్ర చేయబోతోంది పూజా హెగ్డే అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ఉన్నట్టుండి వీరిద్దరు చెల్లెలు పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: