ఒకప్పుడు సినిమాలలో తెగ సందడి చేసిన శ్రీ రెడ్డి ఆ తర్వాత కాస్టింగ్ కౌచ్ ఇష్యూతోతెగ హాట్ టాపిక్‌గా మారిపోయింది.. సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ కూడా ఏదో ఒక పోస్టులు చేస్తూ రచ్చ చేయడమే ఆమె పని అయిపొయింది .

అలాగే తరచూ అందాల విందు చేస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను వదులుతూ ఇంటర్నెట్‌ను తెగ ఊపేస్తోంది. శ్రీరెడ్డి నోరు తెరిస్తే బూతులు ఎలా వస్తాయో.. గరిటె పట్టిందంటే ఘుమఘుమలు కూడా అదే రేంజ్‌లో ఉంటాయట.. ఈ మధ్య కాలంలో విలేజ్ స్టైల్ వంటకాలతో రుచిచూపిస్తున్న శ్రీరెడ్డి.. తాజాగా నల్లి బొక్కలకూర వండిందట
.

ఇన్నాళ్లు ఆంధ్రావాళ్ల కోసం వంటలు చేసిన శ్రీ రెడ్డి తెలంగాణ వాళ్ల కోసం ఇది చేసానని చెప్పింది.. నాటు మాటలతో మసాలా ఘాటు దట్టించి కూర వండేసింది శ్రీరెడ్డి.ఈ కూర తింటే రాత్రంతా మూలుగుడే మూలుగుడు అంటూ మూలుగుతూ చెప్పుకొచ్చింది శ్రీ రెడ్డి. ఘాటు అందాలతో మసాల కూర వండిన శ్రీ రెడ్డి వావ్ అందరిని అనిపించింది. ఈ అమ్మడి వంటలకు సంబంధించిన వీడియోలకి మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. శ్రీ రెడ్డి ఆరంభంలో ఓ న్యూస్ ఛానెల్‌లో ప్రజెంటర్‌గా వర్క్ చేసిందట.. అలా చాలా మంది దర్శక నిర్మాతల దృష్టిలో పడిందట.ఈ క్రమంలోనే ‘నేను నాన్న అబద్ధం’ అనే సినిమాతో ఆమె హీరోయిన్‌గా చేసింది. ఆ తర్వాత ‘అరవింద్ 2’, ‘జిందగీ’ వంటి వాటిలో కూడా నటించింది.

ఆ తర్వాత వెండితెరకు ఆమె దూరమైపోయింది.ఆ మధ్య కాలంలో టీవీ డిబెట్లలో కొంత మంది సినీ ప్రముఖులపై విరుచుకు పడిన శ్రీరెడ్డి.. సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది స్టార్స్ ను టార్గెట్ చేసింది. మరీ ముఖ్యంగా టాలీవుడ్‌లోని పలువురు హీరోలు, స్టార్ హీరోయిన్లపై వివాదాస్పద పోస్టులు పెట్టింది.ఇప్పటికీ కొంత మంది స్టార్ హీరోలను విమర్శిస్తూ ఆమె కామెంట్లు చేస్తూనే ఉంది. దీంతో ఆమె ఎంతో మందికి శత్రువులా మారింది.ప్రస్తుతం తమిళనాడులో ఉన్నప్పటికీ తెలుగు ప్రేక్షకులకి మాత్రం చాలా దగ్గరగానే ఉంటుందట.. ఈ అమ్మడికి సంబంధించిన ఏ పోస్ట్ అయిన కూడా వైరల్ అవ్వాల్సిందే మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: