తాజాగా చెన్నైలో ఘనంగా నిర్వహించిన ఈవెంట్ లో ట్రైలర్ లాంచ్ చేశారు.ట్రైలర్ విషయానికి వస్తే.. సింహం, పులి, చిరుతపులి ఒక అడవికి వేటకు వెళితే అని కమల్ హాసన్ చెప్పే డైలాగ్తో ట్రైలర్ ప్రారంభమయ్యింది. విజయ్ సేతుపతి, ఫహద్ గ్యాంగ్స్టర్స్ గా కనిపించనున్నట్టు తెలుస్తుంది. కమల్ హాసన్ రా ఏజెంట్గా కనిపిస్తారని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇందులో కమల్, విజయ్, ఫహద్ లుక్స్ ఆద్యంతం కట్టిపడేస్తున్నాయి. ఇప్పటికే ఫస్ట్ లుక్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. కమల్కి ఈ సినిమా హిట్ అయ్యేలా ఉందని అభిప్రాయ పడుతున్నారు..
గత కొన్నెల్లుగా కమల్ నుంచి ఎన్ని సినిమాలు వచ్చిన కూడా హిట్ మాత్రం అవ్వలేదు..కొంత కాలం గ్యాప్ తీసుకొని వస్తున్న ఈ సినిమా పై అంచనాలు రెట్టింపు అయ్యాయి.యాక్షన్ సీన్స్కు తగ్గట్లుగా అనిరుధ్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరింది. ట్రైలర్ సినిమాలపై అంచనాలను మరో రేంజ్కు తీసుకు వెళ్లింది. ఇక ఈ సినిమాలో మరో తమిళ సూర్య గెస్ట్ రోల్లో కనిపించనున్నారని అంటున్నారు. ‘ఖైదీ’, ‘మాస్టర్’ చిత్రాల తర్వాత లోకేష్ దర్శకత్వం వహించిన సినిమా కావడం, ముగ్గురు విలక్షణ నటులు కలిసి నటించడంతో ‘విక్రమ్’పై జనాలకు ఆసక్తి రెట్టింపు అయింది.. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి..