చిరంజీవి, రాజశేఖర్-జీవిత మధ్య మాటల యుద్ధం గతంలో బాగా జరిగింది. ఆ తర్వాత మా ఎన్నికల విషయంలో కూడా ఏదో హడావిడి నడిచింది. కానీ ఇప్పటికీ చిరంజీవి, రాజశేఖర్ కుటుంబాల మధ్య అంత సఖ్యత లేదన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల రాజశేఖర్ కొత్త సినిమా శేఖర్ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా.. ఈ విషయాన్ని మరోసారి ప్రస్తావించారు జీవిత. చిరంజీవికి తమకి మధ్య ఇష్యూస్ లేవని, కేవలం సోషల్ మీడియా వల్లే తమ మధ్య దూరం పెరిగిందని చెప్పారు జీవిత. యూట్యూబ్ థంబ్ నెయిల్స్ తో ఏదో జరిగిపోతోందనే భ్రమ కలిగిస్తున్నారని, తమ మధ్య దూరానికి పరోక్ష కారణం ఆ థంబ్ నెయిల్సేనని చెప్పారు.

శేఖర్ ఎలా ఉంటుంది..?
హీరో రాజశేఖర్ కరోనా సమయంలో బాగా ఇబ్బంది పడ్డారు. ఓ దశలో ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమించిందని కూడా వార్తలొచ్చాయి. కానీ జీవిత ధైర్యం కోల్పోకుండా ఆయన ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు. చివరకు రాజశేఖర్ కోలుకుని పూర్తి ఆరోగ్యవంతుడిగా మళ్లీ సినిమాలకు హారయ్యారు. ఇలా కోలుకున్న తర్వాత ఆయన నటించిన సినిమా శేఖర్. ఆయన కుమార్తె శివాని కూడా ఇందులో ఓ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా ఈనెల 20న విడుదలవుతోంది.

మలయాళ లో హిట్‌ మూవీ జోసెఫ్‌ కు ఇది రీమేక్. ఈ రీమేక్ కి ముందుగా కరుణ కుమార్, నీలకంఠ.. ఇలా చాలామంది డైరెక్టర్ల పేర్లు వినిపించాయి. కానీ చివరిగా జీవిత ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. మనసున్న ప్రతి ఒక్కరికీ ఈ సినిమా బాగా నచ్చుతుందని అంటున్నారు జీవిత. ప్రతి ఒక్కరి లైఫ్‌లో 'శేఖర్‌' అనే వ్యక్తి ఉంటాడని, అంతలా ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుందని చెప్పారు జీవిత. ఇక సహజంగా చిరంజీవి కుటుంబంతో ఉన్న విభేదాలపై కూడా సినిమా ప్రమోషన్లో ప్రశ్నలు ఎదురవుతాయి. దీనికి జీవిత చెప్పిన సమాధానం మాత్రం కాస్త కలకలం రేపింది. తామెప్పుడూ చిరంజీవి కుటుబంతో విభేదాలు కోరుకోలేదని చెప్పారామె. అయితే కేవలం యూట్యూబ్ వారి వల్లే తమ మధ్య దూరం పెరిగిందని అంటున్నారు. కొంతమంది సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం వల్లే తమ మధ్య గ్యాప్ వచ్చిందని అన్నారు. చిరంజీవి ఆఫర్ ఇచ్చినా రాజశేఖర్ ఆయన సినిమాలో చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు జీవిత. తాను కూడా మంచి క్యారెక్టర్ వస్తే స్క్రీన్ పై కనిపించడానికి రెడీగా ఉన్నానని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: