మెగా కుటుంబంతో అత్యంత సన్నిహితంగా మహేష్ ఉంటాడు. పవన్ చిరంజీవిల సినిమాలకు కూడ వాయిస్ ఓవర్ ఇచ్చి తన స్నేహ బంధాన్ని చాటుకున్నాడు. ‘వకీల్ సాబ్’ ‘భీమ్లా నాయక్’ ‘పుష్ప’ ‘ఆచార్య’ సినిమాల విడుదల సమయంలో ఆసినిమాలు విజయం సాధించాలి అంటూ సోషల్ మీడియాలో తన అభినందనలు తెలియచేయడమే కాకుండా ‘ఆచార్య’ మూవీలో చరణ్ చిరంజీవి లు ఒక పాటకు వేసిన స్టెప్స్ చూసి తాను ఆనందం పట్టలేకపోయాను అంటూ తన అభిమానాన్ని కూడ ఓపెన్ గానే తెలియచేసాడు.


దీనికితోడు చరణ్ మహేష్ లు కలిసి ఫ్యామిలీ ట్రిప్ లు వెళ్ళిన సందర్భాలు కూడ ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో లేటెస్ట్ గా విడుదలైన ‘సర్కారు వారి పాట’ గురించి చిరంజీవి చరణ్ అల్లు అర్జున్ లతో పాటు మెగా ఫ్యామిలీ లోని ఏఒక్క హీరో కనీసపు స్పందన తెలియచేయకుండా మౌనంగా ఉండటం మహేష్ అభిమానులకు ఆశ్చర్యాన్ని కోపాన్ని కూడ తెప్పిస్తున్నట్లు టాక్.


‘సర్కారు వారి పాట’ మూవీకి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ఆమూవీలో నటించిన మహేష్ నటుడుగా పూర్తిగా రాణించాడు అని విమర్శకులు కూడ చెపుతున్నారు. అయినప్పటికీ కనీసం ఒక అభినందన కూడ తెలియచేయలేనంత బిజీగా మెగా హీరోలు ఉన్నారా అంటూ మహేష్ అభిమానులు సెటైర్లు వేస్తున్నట్లు టాక్. దీనికితోడు బాలీవుడ్ పై మహేష్ చేసిన కామెంట్స్ కు తెలుగు ఇండస్ట్రీ నుండి ఏఒక్కడు కూడ సపోర్ట్ ఇవ్వనప్పటికీ బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ మహేష్ ను మెచ్చుకోవడం గమనింప దగ్గ విషయం.


వాస్తవానికి మహేష్ టాప్ హీరోలు అందరితోను మల్టీ స్టారర్ లో నటించడానికి ఓపెన్ గానే ఆశక్తిని కనపరుస్తున్నారు. అయితే ఈవిషయంలో మెగా హీరోల నుండి కూడ స్పందన రావడం లేదు. 'సర్కారు వారి పాట' మూవీ కలక్షన్స్ పై జరుగుతున్న ప్రచారం ఫాల్స్ అంటూ కొందరు వేస్తున్న సెటైర్లు కూడ మహేష్ అభిమానులకు తీవ్ర కోపాన్ని తెప్పిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: