బాలివుడ్ ఫైర్ బ్రాండ్, అందాల రాసి, వివాదస్పద నటి కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన పని లేదు..ఆమె సినిమాల కన్నా కూడా ఎక్కువగా వివాదాల మీద ఫోకస్ పెట్టింది.దాంతో ఎన్నో రచ్చ లకు కెరాఫ్ గా నిలిచింది.ఆమె సినిమాల విడుదల కూడా చర్చలు జరిగిన తర్వాత థియెటర్లలోకి వస్తాయి.ఇకపోతే ఈ మధ్య కంగనా నటించిన సినిమా ‘ధాకడ్‌’. స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా మే 20న థియేటర్లలో విడుదల కానుంది.గత కొద్ది రోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉంది.
 

బాలీవుడ్ లోని కొంతమంది హీరోలు, నిర్మాతలు, దర్శకులపై కంగనా సమయం దొరికి నప్పుడల్లా లేని పోనీ వాటికి విమర్శలు గుప్పిస్తుంది.ఇప్పుడు ప్రమోషన్స్ లో భాగంగా బాలివుడ్ స్టార్ హీరోల పై నోటికి వచ్చిన విధంగా కామెంట్లు చేసింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోలు నా సినిమాని ప్రమోట్ చేయరు. కానీ ఇతర సినిమాలని ప్రమోట్ చేస్తారు. అక్షయ్ కుమార్ నాకు కాల్ చేసి తలైవి సినిమా బాగుందని చెప్పాడు. కానీ దాని గురించి నేను రెస్పాండ్ అవ్వలేదు.



అమితాబ్ బచ్చన్ కూడా నా సినిమా సాంగ్ పై సోషల్ మీడియా లో ఒక పోస్ట్ చేశాడు..ఆ తర్వాత వెంటనే డిలీట్ చేశాడు.అజయ్ దేవగణ్‌ వేరే హీరోయిన్స్ చేసే మహిళా ప్రాధాన్యత చిత్రాల్లో నటిస్తారు కానీ నా సినిమాల్లో నటించరు. ఎందుకంటే నా సినిమాల్లో నాకే ఎక్కువ పేరు వస్తుందని వారికి తెలుసు. ఇప్పుడు నా సినిమాకు సపోర్ట్‌ చేసిన అర్జున్‌ రాంపాల్‌కి నేను కృతజ్ఞత చూపిస్తాను.నాకు మద్దతుగా ఎవరూ ఉన్నా లేకున్నా నేను అందరి పట్ల కృతజ్ఞతా భావంతో ఉంటాను అంటూ కంగనా చురకలు అంటించింది. ఇవి ఇంక ఎంత దూరం వెళుతుంది అనేది చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: