యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో గతంలో కొరటాల శివ తీసిన బ్లాక్ బస్టర్ మూవీ జనతా గ్యారేజ్. సమంత కథానాయికగా నటించిన ఈ సినిమాలో మలయాళ నటుడు మోహన్ లాల్ ఒక కీలక పాత్ర చేయగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. మైత్రి మూవీ మేకర్ వారు ఎంతో గ్రాండ్ గా నిర్మించిన ఈ సినిమా పెద్ద సక్సెస్ కొట్టింది. ఇక త్వరలో ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్ లో మరొక మూవీ రానున్న విషయం తెల్సిందే. ఎన్టీఆర్ కెరీర్ 30వ సినిమాగా తెరకెక్కనున్న ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంస్థలు నిర్మించనున్నాయి.

ఇటీవల అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చిన ఈ మూవీ ప్రారంభోత్సవం ఈనెల 20న ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా జరుగనున్నట్లు టాక్. అనిరుద్ సంగీతం అందించనున్న ఈ ప్రతిష్టాత్మక మూవీని భారీ స్థాయి పాన్ ఇండియా మూవీగా ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్మించనున్నారు నిర్మాతలు. అయితే విషయం ఏమిటంటే, ఇటీవల మెగాస్టార్ తో తీసిన ఆచార్య మూవీతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ని చవి చూసిన కొరటాల, ఎలాగైనా ఎన్టీఆర్ మూవీతో పెద్ద విజయం సొంతం చేసుకునేలా స్క్రిప్ట్ ని ఎంతో బాగా సిద్ధం చేశారట.

ఇటీవల స్క్రిప్ట్ మొత్తం పూర్తి అయిన ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ సార్క్ కూడా ఆల్మోస్ట్ పూర్తి కావచ్చినట్లు టాక్. అటు ఎన్టీఆర్ వరుసగా హిట్స్ తో తగ్గేదేలే అనే రేంజ్ లో మంచి జోరు మీద ఉండగా, ఆయన ఇమేజ్ ని మరింతగా పెంచేలా, అలానే దర్శకుడిగా తన స్థాయి కూడా పెరిగేలా ఈ మూవీ స్టోరీ కొరటాల కసితో సిద్ధం చేసారని, మంచి యాక్షన్ తో పాటు భారీ కమర్షియల్ హంగులు కూడా ఇందులో ఉన్నాయని సమాచారం. మొత్తంగా ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్ లో రానున్న ఈ మూవీ పక్కాగా సక్సెస్ కొట్టే ఛాన్స్ కనపడుతోందని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఈ మూవీ జూన్ లో పట్టాలెక్కి వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానున్నట్లు టాక్.


 



మరింత సమాచారం తెలుసుకోండి: