బాలయ్య - బోయపాటి శ్రీను కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా ఈ స్టార్ సెలబ్రెటీల కాంబోకి ఉన్న ప్రాముఖ్యతే వేరప్ప. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఇప్పటివరకు సింహ, లెజెండ్, అఖండ చిత్రాలు వచ్చి హ్యాట్రిక్ విజయాన్ని అకౌంట్ లో వేసుకున్నారు. వీరిది సక్సెస్ఫుల్ కాంబినేషన్ అని మరోసారి రుజువు చేశారు. ప్రేక్షకుల్లో వీరి కాంబోపై కూడా నమ్మకాలు బలంగా ఉన్నాయి. ఈ మూడు చిత్రాలు కూడా భారీ విజయాన్ని నమోదు చేసి కాసుల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఇక లెజెండ్ సినిమా అయితే అంచనాలకు మించి ఘన విజయాన్ని అందుకుని బాలయ్య కెరియర్ లోనే ది బిగ్గెస్ట్ సక్సెస్ కూడా నిలిచి ప్రత్యేకతను సంతరించుకుంది.

ఇక అఖండ సినిమా అయితే లాక్ డౌన్ తరవాత రిలీజ్ అయిన పెద్ద చిత్రంగా.. పైగా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో టాలీవుడ్ కు సరికొత్త ఉత్సాహం నెలకొంది. ఇదిలా ఉండగా ఈ కాంబోలో మరో సినిమా అన్న వార్తలు ఎప్పటి నుండో వస్తుండగా .. ఇటీవల జరిగిన అఖండ సక్సెస్ మీట్ లో దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. బాలయ్యతో ఒక్క సినిమా చేసే అవకాశం రావడమే అదృష్టం అలాంటిది  తనకు ఏకంగా మూడు సినిమాలు డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కడం అద్భుతం అని చెబుతున్న క్రమంలో ప్రేక్షకుల నుంచి మరో సినిమా ఉండనుందా..? అని ప్రశ్న తలెత్తగా.. అందుకు బోయపాటి ఖచ్చితంగా అని చెప్పినప్పటి నుండి వీరి కాంబోలో మరో చిత్రంపై అందరి దృష్టి నెలకొంది.

అయితే తాజా సమాచారం మేరకు లెజెండ్ చిత్రానికి సీక్వెల్ రెడీ చేస్తున్నట్లు సమాచారం. లెజెండ్ చిత్రానికి రాజకీయ హంగులు దిద్ది పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాని కొనసాగించనున్నట్లు ప్లానింగ్ జరుగుతోందట. పొలిటికల్ సెటైర్లు, పంచ్‌లతో ఈ చిత్రాన్ని బాలయ్య పవర్ కి తగ్గట్టుగా ప్లాన్ చేస్తున్నారట బోయపాటి. ఇప్పటికే సన్నాహాలు మొదలైనట్లు తెలుస్తుండగా... లెజెండ్ సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన వారే ఈ చిత్రాన్ని కూడా నిర్మించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే సగానికి పైగా కథను కూడా సెట్ చేసేసారు అని బాలయ్య , దర్శకుడు అనిల్ రావిపూడి చిత్రం తరవాత ఈ పట్టాలు ఎక్కుతుంది అని టాక్ వినిపిస్తోంది



 







మరింత సమాచారం తెలుసుకోండి: