టాలీవుడ్ లో రష్మిక మందన ఇటీవల బెంగళూరు ఎయిర్ పోర్ట్ లో కనిపించడం ప్రతి ఒక్కరు ఈమె గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఈమె హడావిడిగా ఫ్లైట్ ఎక్కడంతో రష్మిక ఎక్కడికి వెళ్తుందో అంటు ప్రతి ఒక్కరు సోషల్ మీడియా లో పెద్ద చర్చనీయాంశంగా మారుతోంది. "యానిమల్ " షూటింగ్ కోసం ఇంత హడావిడి పడుతోందా అంటే కొంతమంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ టెన్షన్ అంతా కేవలం తన స్నేహితురాలి పెళ్లి కోసమే అన్నట్లుగా ఇప్పుడు తాజాగా మరో వార్త వెలుగులోకి వచ్చింది.

తాజాగా రష్మిక తన స్నేహితురాళ్లతో కలిసి దిగిన ఫోటో తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేయడం తో.. ఈ అసలు విషయం బయటికి వచ్చింది. రష్మిక తన చిన్ననాటి స్నేహితురాలు వివాహం కోసం వెళ్ళినట్లుగా ఈ ఫోటో ను ఉద్దేశించి ఆమె ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. నటిగా రష్మిక ఈ ప్రపంచానికి పరిచయం కాకముందే తను నా లైఫ్లో ఉండేదని తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను కూడా తెలియజేసింది రష్మిక. రష్మిక మాట్లాడుతూ.. ఈరోజు నాకు దగ్గరైనా రాగిని వివాహం జరగబోతోంది. ఇక ఈరోజు దాటితే ఆమె మాతో కలిసి ఫోటో దిగలేదు.. ప్రపంచం కోసం ఈ రోజు మిస్ చేసుకోవాలనుకోవడం లేదు అంటూ తెలియజేసింది.తెల్లవారుజామున 4 గంటలకు ఫ్లైట్ మిస్ అవడంతో మరొక ఫ్లైట్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఆలస్యం అయినందువల్ల ఇబ్బందులతో ఇలా స్పీడ్ గా వెళ్ళవలసి వచ్చింది అని తెలియజేసింది. ఎలాగోలాగా వివాహానికి హాజరు అయ్యారని.. ఈ అమ్మాయిల గుంపులో నేను కూడా పెరిగానని తెలియజేసింది. 17 సంవత్సరాలుగా వీరందరూ నాకు తెలుసు ఇప్పటికీ వీళ్లలో ఎటువంటి మార్పు రాలేదు నన్ను ఇప్పటికీ ఎంతో సంతోషంగా చూసుకున్నారు అని తెలియజేసింది. వీరందరినీ ఇలా కలవడం తనకు ఆనందంగా ఉందని నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాన్ని ఈ రోజున ఈ సందర్భంగా ఇలా తెలియజేస్తున్నాను అని తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: