సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా సర్కారు వారి పాట సినిమాలో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే.  ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా, ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. తమన్ ఈ సినిమాకు అందించిన పాటలు సినిమా విడుదలకు ముందు నుండే ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పొందాయి.  భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు లాంటి వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా కావడంతో సర్కారు వారి పాట సినిమాపై ప్రేక్షకుల్లో మొదటి నుండి మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.  

అలా ఎన్నో అంచనాల నడుమ మే 12 వ తేదీన థియేటర్ లలో విడుదల అయిన సర్కారు వారి పాట సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్ ను సొంతం చేసుకొని అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను ఆఫీస్ దగ్గర రాబడుతోంది.  ఇప్పటివరకు నాలుగు రోజుల బాక్సాపీస్ రన్ ని పూర్తి చేసుకున్న  సర్కార్ వారి పాట సినిమా ప్రపంచవ్యాప్తంగా 133.80 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసి ఫుల్ స్పీడ్ లో దూసుకు పోతోంది.  

ఈ రేంజ్ విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకోవడంతో చిత్ర బృందం సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించే ఉద్దేశంతో విజయవాడలో ఈ మూవీ సక్సెస్ ఈవెంట్ ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.  కాకపోతే తాజాగా విజయవాడ కాకుండా సర్కార్ వారి పాట సక్సెస్ ఈవెంట్ ను కర్నాల్  ఎస్ టి బి సి కాలేజ్ గ్రౌండ్స్ , ప్రకాష్ నగర్ కర్నూల్ లో ఈ రోజు సాయంత్రం ఐదు గంటల నుండి ప్రారంభించనున్నట్లు చిత్ర బృందం తాజాగా మరో ప్రకటన చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: