సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమా మే 12 వ తేదీన గ్రాండ్ గా థియేటర్లలో విడుదల అయిన విషయం మన అందరికి తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో తమన్ సంగీత సారథ్యంలో తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమా విడుదలైన మొదటి రోజు నుండే బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్ ను తెచ్చుకొని అదిరిపోయే రేంజ్ లో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల ను కూడా రాబడుతోంది.  ఇది ఇలా ఉంటే సర్కారు వారి పాట సినిమా విడుదలయిన నాలుగవ రోజు కూడా అదిరిపోయే కలెక్షన్లను బాక్సాఫీస్ దగ్గర దక్కించుకుంది. సర్కారు వారి పాట మూవీ విడుదలైన నాలుగవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 12.06 కోట్ల షేర్ కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించి ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో నాలుగవ రోజు అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్ట్ లో మూడవ వరుసలో  నిలిచింది.

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఆలియా భట్ , ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా తెరకెక్కిన 'ఆర్ ఆర్ ఆర్'  సినిమా విడుదలైన నాలుగవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 17.73 కోట్ల షేర్ కలెక్షన్లను బాక్సాఫీస్ దగ్గర సాధించి మొదటి స్థానంలో నిలవగా,  ప్రభాస్ హీరోగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి 2 సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయిన నాలుగవ రోజు 14.73 కోట్ల షేర్ కలెక్షన్లను బాక్సాఫీస్ దగ్గర సాధించి రెండవ స్థానంలో నిలిచింది.


ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమా విడుదల అయిన నాలుగవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 12.06 కోట్ల షేర్ కలెక్షన్లను సాధించి మూడవ స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: