మన టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు కి వున్న క్రేజ్ ఇంకా ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది వేరు.. సౌత్ సినిమా హీరోల్లో మహేష్ బాబుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ మరెవ్వరికీ లేదు అంటే ఖచ్చితంగా నమ్మాల్సిందే..తాజగా సర్కారు వారి పాట సినిమాతో మహేష్ స్టామినా ఏంటో మరోసారి రుజువైంది. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే రికార్డు స్థాయిలో గతంలో ఏ సినిమాకి చేయంటువంటి నెగటివిటీని స్ప్రెడ్ చేశారు మెగా హీరోల ఫ్యాన్స్ అందరూ కలిసి.. కానీ వాళ్ళు చేసిన నెగటివిటీ వలన మహేష్ క్రేజ్ ఇంచు కూడా తగ్గలేదు. అలాగే సర్కారు వారి పాట వసూళ్లు పైసా కూడా తగ్గలేదు. మెగా హీరోల సినిమాల వసూళ్లు మొత్తాన్ని కేవలం నాలుగు రోజుల్లో చేరిపేసి నాన్ రాజమౌళి ఇండస్ట్రీ రికార్డులు సృష్టించింది.ఇకపోతే సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా తర్వాత తర్వాత సినిమాపై ద్రుష్టి పెట్టినట్టు సమాచారం తెలుస్తుంది.ఒక వైపు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ దర్శక ధీరుడు రాజమౌళి తో సినిమా గురించి చర్చిస్తూనే మరో వైపు ఇప్పటికే లాంచ్ చేసిన త్రివిక్రమ్ సినిమాను కూడా సెట్స్ మీదకు తీసుకు వెళ్లేందుకు సూపర్ స్టార్ మహేష్ సన్నాహాలు చేస్తున్నాడు.



సినిమా రెగ్యురల్ షూటింగ్ జులై నెల నుండి స్టార్ట్ కాబోతుందట.. ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ బౌండ్ స్క్రిప్ట్ ను కూడా లాక్ చేశారట.. జులై నెలలో ఈ సినిమాను స్టార్ట్ చేయడానికి కావాలన్సిన అన్ని పనులను కూడా పూర్తి చేసారట. ఈ సినిమా జులై నెలలో స్టార్ట్ అయ్యి డిసెంబర్ నెల నాటికీ టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేయాలి అన్నది ప్లాన్. 2023 సంక్రాంతి సీజన్లో విడుదల చేయాలనీ అనుకుంటున్నారట.. అందుకే ఈ లోపు ఈ సినిమాను పూర్తి చేయాలనీ త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్లాన్ గీస్తున్నాడట. ఇక ఈ సినిమా పూర్తి అయినా తర్వాత అప్పుడు యస్ యస్ రాజమౌళి సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇది మహేష్ బాబు తొలి పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: