ఇక ఆయన నటిస్తున్న ఆదిపురుష్ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. ఇందులో ప్రభాస్ రాముడిగా నటిస్తుండగా సీతగా కృతి సనన్, రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఇక సైన్స్ ఫిక్షన్ సినిమా ప్రాజెక్ట్ కె లో దీపికా పదుకొనె హీరోయిన్ గా చేస్తుండగా నాగ అశ్విన్ దీనిని ఎంతో గ్రాండియర్ గా రూపొందిస్తున్నట్లు టాక్. అలానే సలార్ విషయానికి వస్తే, పక్కాగా సాగే మాస్ యాక్షన్ మోవీగా తెరకెక్కుతున్న సలార్ తో కెరీర్ పరంగా ప్రభాస్ అతి పెద్ద విజయం అందుకోవడం ఖాయం అని ఇన్నర్ వర్గాల న్యూస్. అయితే విషయం ఏమిటంటే, త్వరలో యువ దర్శకుడు మారుతీతో ప్రభాస్ ఒక సినిమా చేయనున్నారు అనే వార్తలు ఇటీవల మీడియా మాధ్యమాల్లో ప్రచారం అయ్యాయి. మంచి కమర్షియల్ జానర్ కథ ని ప్రభాస్ కోసం సిద్ధం చేసిన మారుతీ, అది ఆయనకి వినిపించి గ్రీన్ సిగ్నల్ కూడా అందుకున్నారని టాక్.
అయితే లేటెస్ట్ టాలీవుడ్ వర్గాలలో ప్రచారం అవుతున్న వార్తల ప్రకారం ఈ మూవీ ప్రస్తుతానికి ప్రభాస్ ప్రక్కన పెట్టారని అంటున్నారు. వాస్తవానికి తాను ప్రస్తుతం చేస్తున్న మూడు సినిమాలు వచ్చే లోపు మారుతీ మూవీ వేగంగా పూర్తి చేయాలని మొదట భావించిన ప్రభాస్, పూర్తి స్క్రిప్ట్ సిద్ధం కాకపోవడం వలన అవి మూడు పూర్తి అయిన అనంతరమే మారుతీ మూవీ చేయాలని నిర్ణయించినట్లు టాక్. అయితే ఇందులో వాస్తవం ఎంతవరకు ఉందొ, అసలు ప్రభాస్ తో మారుతీ మూవీ ఉంటుందో లేదో తెలియాలి అంటే దీనిపై అఫీషియల్ గా ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.