మహేష్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ సర్కార్ వారి పాట చిత్రం హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ చిత్రాన్ని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చే మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే ప్రపంచ వ్యాప్తంగా నాలుగు రోజులలోనే రూ.153 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తోంది. ఇలాంటి సమయంలోనే సక్సెస్ సెలబ్రిటీస్ ని కర్నూల్ లో చాలా ఘనంగా నిర్వహించారు.


ఈ సందర్భంలో మహేష్ మాట్లాడుతూ.. ఈ సక్సెస్ సెలబ్రేషన్ రాలేదు 100 రోజుల వేడుక ఫంక్షన్ చేసుకున్నట్లు ఉంది అని తెలియజేశారు. సర్కారు వారి పాట విషయాన్ని ఎప్పటికి మర్చిపోను అని తెలిపారు. గతంలో ఒక్కడు సినిమా షూటింగ్ జరిగినప్పుడు కర్నూల్ కి వచ్చాను.. ఇప్పుడు రెండు రోజుల వ్యవధిలోనే సర్కారు వారి పాట చిత్రం వేడుకను పెట్టుకున్నామని అయితే ఇంత మంది వస్తారని అనుకో లేదని తెలియజేశారు. మీ అందరిని చూసిన ఉత్సాహంలో తను కూడా స్టేజ్ పైకి వచ్చి డాన్స్ చేయాలనిపించింది అని తెలియజేశారు మహేష్.

మీ అభిమానం ఎప్పటికీ ఇలాగే ఉండాలి ఇది సక్సెస్ మీట్ ఆ లేక 100 రోజుల వేడుక అన్నట్లుగా ఉందని మహేష్ తెలిపారు. తన ఫ్యామిలీతో సర్కారు వారి పాట సినిమాలు చూసినప్పుడు తన కుమారుడు గట్టిగా హగ్ చేసుకున్నాడని.. సితార మాత్రం అన్ని సినిమాలలో కంటే ఇందులో చాలా బాగా చేశావ్ డాడీ తెలిపిందని తెలియజేసాడు. అయితే ఈ సినిమా అంతగా సక్సెస్ కావడానికి డైరెక్టర్ పరుశురామ్ ఆ క్రెడిట్ దక్కుతుందని తెలిపారు. ఈ సినిమా కోసం పాండమిక్ లో చాలా కష్టపడ్డామని.. కానీ ప్రేక్షకులు ఆనందంలో ఈ కష్టమంతా వెళ్ళిపోయింది అని తెలియజేశారు మహేష్. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు అని అలాగే సముద్రఖని గారికి కూడా ధన్యవాదాలు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: