తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి సినిమా నుంచి వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. మొన్నీ మధ్య వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా తో మరో ఘన విజయాన్ని అందుకున్నాడు.. ఆ సినిమా తర్వాత సర్కారు వారి పాట సినిమాలో నటించాడు.ఆ సినిమా ఇటీవల విడుదల అయ్యి భారీ సక్సెస్ ను అందుకున్న విషయం  తెలిసిందే..సినిమా సక్సెస్ ఫుల్ గా థియేటర్లలో దూసుకుపోతుంది. ఇప్పటికే 130 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి రీజనల్ సినిమాల్లో సరికొత్త రికార్డు సృష్టిస్తుంది.


ఇక ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ సోమవారం రాత్రి కర్నూలు STBC కాలేజ్ గ్రౌండ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సభకి అభిమానులు భారీగా తరలి వచ్చారు. చిత్ర యూనిట్ అంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సభలో మహేష్ బాబు మాట్లాడుతూ.. ”ఒక్కడు సినిమా అప్పుడు కర్నూలుకు వచ్చాను. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత వచ్చాను. మా వాళ్ళు కర్నూల్ లో ఈ ప్రోగ్రాం పెడతాము అంటే వెంటనే ఓకే చెప్పాము.ఈ సినిమా సక్సెస్ చేసిన నా అభిమానులందరికి రుణపడి ఉంటాను. ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో ఇలాంటి అభిమానులు నాకు దొరికారు” అని తెలిపారు..


మహేష్ బాబు మాటలకు ఫ్యాన్స్ కేకలు వేస్తూ రచ్చ చేశారు.ఈవెంట్ మధ్యలో తమన్ మ మ మహేష్ సాంగ్ పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు మహేష్ ని కూడా స్టేజి మీదకి రమ్మనడంతో మహేష్ కూడా స్టేజి మీదకి వచ్చి ఆ సాంగ్ కి అక్కడ గ్రూప్ తో కలిసి డ్యాన్స్ వేశారు. దీంతో అభిమానులు కేరింతలు, విజిల్స్ తో స్టేజి ఊగిపోయేలా చేశారు. చాలా సైలెంట్ గా ఉండే మహేష్ మొదటి సారి లైఫ్ లో ఇలా అభిమానుల కోసం డాన్స్ వేశాను అన్నారు. దీంతో మహేష్ డాన్స్ వేసిన వీడియో వైరల్ అవుతుంది..సినిమాల విషయనికొస్తె.. రాజమౌళి, త్రివిక్రమ్ తో సినిమాలు చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: