సూపర్ స్టార్ మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' లాంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత నటించిన  సర్కారు వారి పాట సినిమా మే 12 వ తేదీన థియేటర్ లలో విడుదల అయిన విషయం మన అందరికి తెలిసిందే  ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహించాడు.  ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమా విడుదలకు ముందు నుండే ఈ సినిమా నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.  

అలా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ తెచ్చుకొని ప్రస్తుతం విజయవంతంగా థియేటర్లో ప్రదర్శించబడుతుంది. ఇది ఇలా ఉంటే విడుదలైన మొదటి షో నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సర్కార్ వారి పాట సినిమా అదిరిపోయే కలెక్షన్లను కూడా బాక్సాఫీస్ దగ్గర సాధిస్తుంది. ప్రస్తుతం సక్సెస్ ఫుల్ గా థియేటర్ లలో సర్కారు వారి పాట సినిమా ప్రదర్శించబడుతున్న నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర బృందం కర్నూల్ లో సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది.  

తాజాగా కర్నూల్ లో జరిగిన ఈ సక్సెస్ మీట్ లో సర్కారు వారి పాట చిత్ర బృందం ఈ మూవీ కి సంబంధించిన కొత్త ట్రైలర్ ను విడుదల చేసింది. సమ్మర్ సన్సేషనల్  బ్లాక్ బస్టర్ పేరుతో రిలీజ్ చేసిన ఈ ట్రైలర్ వీడియోలో మహేష్ బాబు హవా భావాలు, డైలాగ్స్ మహేష్ అభిమానులతో పాటు మాములు ప్రేక్షకులకు కూడా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.  ఈ ట్రైలర్ లో మహేష్ బాబు తో పాటు హీరోయిన్ కీర్తి సురేష్ , విలన్ సముద్ర కని సన్నివేశాలు కూడా హైలెట్ గా నిలిచాయి.  ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా కొత్త ట్రైలర్ యూట్యూబ్ లో  ఫుల్ స్పీడ్ లో దూసుకుపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: